అమరావతి: దేవతల రాజధాని ఎలా ఉంటుందో, అదే నమూనాతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చి పవిత్ర కార్యక్రమానికి సహకరించారని వారికి అభినందనలు తెలిపారు.
గురువారం నాడు అమరావతిలోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు.
నిధులు: ఈ విస్తరణ పనులను రూ.260 కోట్లతో రెండు దశల్లో చేపట్టనున్నారు.
నిర్మాణాలు: ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఆలయ ప్రాకారం, మహారాజగోపురం, ఆంజనేయస్వామి ఆలయం నిర్మించబడతాయి.
సీఎం మాడవీధులు మరియు అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు.

Comments
Post a Comment