శ్రీకాకుళం: మెళియాపుట్టి మండలం బందపల్లి గ్రామంలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులతో తన కాళ్లు నొక్కించుకోవడం వీడియో రూపంలో బయటకు రావడంతో జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
వీడియోలో ఆ ఉపాధ్యాయురాలు కుర్చీలో కూర్చుని సెల్ఫోన్లో మాట్లాడుతూ, పక్కనే ఉన్న విద్యార్థులతో కాళ్లు నొక్కించుకుంటూ కనిపించడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ప్రజలు, తల్లిదండ్రులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment