అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఉరవకొండ శాఖ ఆధ్వర్యంలో బుధవారం బస్సు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం అందడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న పాల్తూరు, వన్నూరు, ఆవలికి , గోవిందవాడ వంటి గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులు కి సమయానికి బస్సులు రావడం లేదు ఇలా ఉంటే విద్యార్థులు తరగతులకు ఆలస్యం అవుతున్నారు. ఇది వారి విద్యపై ప్రభావం చూపుతోంది దీనిపై మీరు వెంటనే స్పందించి సమయానికి బస్సులను నడపాలని అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఉరవకొండ శాఖ ఆధ్వర్యంలో తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉరవకొండ బాగ్ కన్వీనర్ నిఖిల్ తేజ , కార్యకర్తలు సురేష్, బాబు పాల్గొనడం జరిగింది
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment