Skip to main content

నేటి సమాజానికి ఆదర్శ సంస్కృతి సాంప్రదాయం బంజారాలది

 

ఉరవకొండ





ప్రపంచ లోని బంజారాల ను ఆకర్షించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలను సింధూ నాగరికత నుంచి నేటి వరకు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు నాగరిక సమాజానికి పోలిన సంస్కృతిని రూపా నాయక్ తండా వాసులు కాపాడుకుంటూ రావడం హర్షణీయం ఆదర్శనీయమని మహారాష్ట్ర కు చెందిన ప్రొఫెసర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధి పండిట్ చౌహాన్ పేర్కొన్నారు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా లో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సామా సంగ్ మహారాజ్ కార్తిక మాసవ పూజోత్సవాల సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించిన బోగ్ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా లు ఏ స్థాయిలో ఉన్న అన్నింటికన్నా బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడమే గొప్ప అని హోదా కన్నా సంస్కృతి గొప్పదని ఈ నగ్న సత్యాన్ని ప్రతి ఒక్క బంజారా ఉద్యోగులు గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు బంజారాలు నిర్వహించుకునే తేజ్ హోలీ దసరా దసరా దీపావళి దీపావళి దీపావళి పండుగలు చాలా పవిత్రమైనదని అందులో ఆదర్శ సంస్కృతి నాగరికత దాగి ఉందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సామా సంగ్ రూపా సాంగ్ ఉమా సంగ్ అనదు సంగ్ కేసు ల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు మూడు రోజులు అన్న సేవా కార్యక్రమం నిర్వహించారు ప్రత్యేకించి సృష్టిలో ఉన్న ప్రాణికోటి జీవరాసులు పంట పొలాలు సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలంటూ పూజలు బోగ్ నిర్వహించారు ఈ కార్యక్రమం బంజారా సంఘం జాతీయ నేత ఎస్ కే కేశవ నాయక్ దాసు నాయక్ నేతృత్వంలో జరిగింది ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బంజారా ప్రముఖులు లాల్ సింగ్ భూక్య మాజీ జెడ్పిటిసి తులసీదాస్ నాయక్ బి జి ఎస్ జాతీయ నేత డాక్టర్ ఎస్ కె మహేష్ బంజారా బార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ధరమ్ సింగ్ నాయక్ ఆర్ నారాయణ వి వి నర్సింగ్ నాయక్ ఆర్ దేవ్లా నాయక్ పాల్గొన్నారు మూడు రోజులపాటు జరిగిన కార్యక్రమానికి సంబంధించిన వస్తు సామగ్రి ని .ఆర్ డాక్య నాయక్ పి రవీంద్రా నాయక్ లతోపాటు ఎం ధక్య నాయక్ ఎస్.కె సాంబ్రి నాయక్ ఎస్ సురేష్ నాయక్ టీచర్ ఎస్ హెచ్ రామా నాయక్ ఆర్ వి దాక్య నాయక్ పొలికి గ్రామానికి చెందిన సురేష్ నందా నాయక్ రామచంద్రనాయక్ తదితరులు సమకూర్చారు కార్యక్రమంలో బంజారా సంఘం ప్రతినిధులు సుబ్రహ్మణ్యం నాయక్ ఉమాపతి నాయక్ ఉందా నాయక్ నందకిషోర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...