పంచాయతీ స్థలాల పరిరక్షణకు డిమాండ్: వార్డు సభ్యుడిపై ఆక్రమణ ఆరోపణలు

Malapati
0

 



ఉరవకొండ నవంబర్ 24:

ఉరవకొండలోని పంచాయతీ స్థలాల ఆక్రమణలు పెరిగిపోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఎమ్.ఆర్.పి.ఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) నాయకులు అధికారులను డిమాండ్ చేశారు.

సోమవారం, ఎమ్.ఆర్.పి.ఎస్. నాయకులు మీనుగ రమేష్ బాబు, సాకే కృష్ణ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా తహసీల్దార్‌కు ఫిర్యాదు అందజేశారు.

 వార్డు సభ్యుడిపై ఆక్రమణ ఆరోపణ

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వార్డు సభ్యులు వాసుదేవుడు కణేకల్ క్రాస్ వద్ద ఉన్న విలువైన పంచాయతీ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు.

మీనుగ రమేష్ బాబు మరియు సాకే కృష్ణ మాట్లాడుతూ, పంచాయతీ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత వార్డు సభ్యులపై ఉందని, అలాంటి వారే చట్ట వ్యతిరేక పనులకు పాల్పడటం ఎంతమాత్రం సహేతుకం కాదని తీవ్రంగా విమర్శించారు.

 ఆందోళన హెచ్చరిక

పంచాయతీ ఆస్తులను తక్షణమే కాపాడాలని, ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు స్పందించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఎమ్.ఆర్.పి.ఎస్. నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!