Skip to main content

ప్రభుత్వాలు మారుతున్నాయి, గంగపుత్రుల తలరాతలు మారడం లేదు!

 

నేడే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం

సాంప్రదాయ మత్స్యకారులు ప్రతి సంవత్సరం నవంబర్ 21 న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని,జరుపుకుంటూనే ఉన్నారు,తమ సమస్యలను ఏకరవు పెడుతూనే ఉన్నారు,కానీ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉన్నదని బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేవి  ఆందోళన వ్యక్తం చేశారు


    ముఖ్యంగా మైదాన ప్రాంత మత్స్య కార్మికులు రాయలసీమ ప్రాంతంలో ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాల పై ఆధారపడి చేపల వేటను సాగిస్తూ బ్రతుకుతున్నారు. మత్స్య సహకార సంఘాలలో సమస్యలు పేరుకుపోయి, కేవలం ఉద్యోగుల కోసమే అన్నట్లుగా మారిపోయి, మత్స్య కార్మికులకు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.

    ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వాలు గంగపుత్రుల సమస్యలను పరిష్కారం చేస్తామన్న మాటలు కోటలు దాటుతున్నాయే గాని ఆచరణ గడప దాటడం లేదు. 

      సాంప్రదాయ మత్స్యకారులు రాయలసీమ ప్రాంతంలో ప్రాథమిక మత్స్య సహకార సంఘాల పై ఆధారపడి బ్రతుకుదామ నుకుంటే ఆ సంఘాలు పెత్తందారుల చేతుల్లోకి వెళ్లిపోయిన కారణంగా సాంప్రదాయ మత్స్యకారులు రోజువారి కూలీలుగా బ్రతికే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 

     తాము పస్తులుండి ప్రభుత్వాలకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సాంప్రదాయ మత్స్యకారులను గురించి ఈ ప్రభుత్వాలు ఆలోచించడం లేదు,కనీస గౌరవం లేదు, అంటరానితనంతో అలమటిస్తున్నారు.

    సముద్ర తీర ప్రాంతాలలో వేట నిషేధం కాలములో మత్స్యకార భరోసా ఇస్తున్న ప్రభుత్వం,మైదాన ప్రాంతంలో చెరువులు,నదులు, ప్రాజెక్టులలో వేట సాగిస్తూ మత్స్య సహకార సంఘాల పై ఆధారపడిన సాంప్రదాయ మత్స్యకారులకు"మత్స్యకార నేస్తం"ప్రత్యేక పింఛన్లు, సబ్సిడీ రుణాలు, ఫిష్ మాల్ట్ ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ మున్సిపాలిటీలలో స్థలాలు, గదుల కేటాయింపులు, ప్రాసెసింగ్ యూనిట్లు,ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు,మత్స్య సహకార సంఘాలకు, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ కో- ఆపరేటివ్ ఫెడరేషన్(ఆప్ కాఫ్) సంస్థలకు అధ్యక్షులుగా సాంప్రదాయ మత్స్యకారులను నామినేట్ చేసే జీవో తీసుకువచ్చి,వారి పిల్లలకు ఉచిత విద్య,వైద్య సౌకర్యాల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టకపోతే ఇప్పటికే వలస బాట పట్టిన సాంప్రదాయ మత్స్యకారులు ఎటుపోవాలో దిక్కుతోని పరిస్థితులలో ఆత్మహత్యలు,ఆకలిచావులకు గురికాక తప్పదు.ప్రపంచ మత్స్య కారుల దినోత్సవానికి అర్థం ఉండదు.కావున ఈ ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం సందర్భంగా నైనా మంచి నిర్ణయాలు తీసుకుంటారని,తద్వారా మంచి రోజులు వస్తాయని .కెవి రమణ,జిల్లాఅధ్యక్షులు,బెస్త సేవా సంఘం,ఆశా భావం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...