Skip to main content

మంత్రి పయ్యావుల స్ఫూర్తి... విడపనకల్లు – గడేకల్లు బీటీ రోడ్డు పూర్తి..

4 నెలల్లోనే 8.6 కి.మీ మార్గం నిర్మాణం

విడపనకల్లు: గ్రామీణ రహదారుల అభివృద్ధి స్ఫూర్తి తో రాష్ట్ర ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్  విడపనకల్లు మండలంలో  విడపనకల్లు – గడేకల్లు నూతన బీటీ రోడ్డు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి చేశారు. 12 అడుగుల వెడల్పుతో, మొత్తం 8.600 కిలోమీటర్ల ఈ రహదారి కేవలం నాలుగు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చి మండల ప్రజలు మెప్పు పొందారు. ఆయన దారి రహదారి అన్న చందంగా, పయ్యావుల సోదరులు రూటే సపరేటు అని నిరూపించారు.

సకాలంలో పూర్తి చేసిన పనులు

ఈ రహదారి పనులను స్వయంగా మంత్రి పయ్యావుల కేశవ్ గారు పర్యవేక్షించారు. జూలై 5న గడేకల్లు గ్రామంలో భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన ఆయన, కాంట్రాక్టర్‌కు నాలుగు నెలల్లోనే నాణ్యతతో కూడిన రహదారిని పూర్తి చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మంత్రి వ్యక్తిగత పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్షల కారణంగా పనులు వేగవంతమై, అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయబడ్డాయి.

మండల కేంద్రానికి మెరుగైన అనుసంధానం

ఈ నూతన రహదారి పూర్తికావడంతో విడపనకల్లు మండలంలోని అనేక గ్రామాలకు మండల కేంద్రానికి చేరుకోవడం సులభమైంది. ప్రధానంగా విడపనకల్లు, ఆర్. కొట్టాల, గడేకల్లు, డోనేకల్లు, కడధరబెంచి, ఎన్. తిమ్మాపురం, పెంచలపాడు, పోలికి వంటి గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది.

ప్రతిరోజూ వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపులు, ట్రాక్టర్లతో మండల కేంద్రానికి రాకపోకలు సాగించే ప్రజలకు కొత్త బీటీ రహదారి విశేష ఉపశమనాన్ని ఇచ్చింది. మెరుగైన రహదారి కారణంగా ప్రయాణ సమయం తగ్గి, వాహనాల రాకపోకలు మరింత సులభంగా మారాయి. ముఖ్యంగా రోజువారీ పనులకు వెళ్లే వారికి, తమ పొలాలకు వెళ్లే రైతులకు ఇది ఎంతో మేలు చేసింది.

ఏపీఎస్ఆర్టీసీ సేవలకు ప్రయోజనం

ఈ రహదారి మీదుగా ప్రస్తుతం విడపనకల్లు – గుంతకల్లు మార్గంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు రోజుకు 6 సార్లు రాకపోకలు సాగిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండటం వలన ఈ బస్సు సేవలు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. రహదారి మెరుగుపడడం వలన భవిష్యత్తులో బస్సు సేవలను మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది

మంత్రికి మాలపాటిశ్రీనివాసులు, మధుబాబు,ఏళ్ళ హరి ప్రజల కృతజ్ఞతలు

చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రధాన రహదారి పనులను కేవలం నాలుగు నెలల్లోనే అత్యంత నాణ్యతతో పూర్తి చేయించినందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్‌కుగ్రామీణ సేవా సమితి జిల్లా అధ్యక్షులు మాలపాటి శ్రీనివాసులు, సహచ జిల్లా కార్యదర్శి మీనుగ మధుబాబు గడే కల్ తెలుగు యువత నాయకులు ఏళ్ళ హరి స్థానిక ప్రజలు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి పయ్యావుల అభివృద్ధి ని పరుగులు తీయిస్తున్నారని వారు తెలిపారు .


 


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...