ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతలో 'ప్రజా ఉద్యమం' – మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

Malapati
0



 

అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ నియోజకర్గం:

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో బుధవారం 'ప్రజా ఉద్యమం' హోరెత్తింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు గళమెత్తాయి.

ర్యాలీ వివరాలు మరియు డిమాండ్లు

భారీగా తరలివచ్చిన శ్రేణులు

ఈ నిరసన ర్యాలీలో ప్రజలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, టవర్‌క్లాక్‌ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ఉధృతంగా కొనసాగింది.

ప్రధాన నినాదాలు

ర్యాలీ పొడవునా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా:

 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పేదల భవిష్యత్తు"

 ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు"

 "ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్‌ కళాశాలలు నిర్వహించాలి"

అంటూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆర్డీఓకు వినతిపత్రం సమర్పణ

నిరసన ర్యాలీ ముగింపులో అనంత వెంకటరామిరెడ్డి, ఇతర పార్టీ నేతలు ఆర్డీఓ కార్యాలయ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు, ప్రజలకు కలిగే నష్టాలను అనంత వెంకటరామిరెడ్డి వివరించారు. ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ వైద్య సేవలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో పార్టీ శ్రేణులు,సోషల్ మీడియా నగరవిభాగం కార్యదర్శి సయ్యద్ మహమ్మద్ ఇమ్రాన్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!