Skip to main content

మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజాదర్బార్‌కు విశేష స్పందన



 

 

మార్కాపురం: మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు.

అప్పటికప్పుడే కొన్ని సమస్యల పరిష్కారం

ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం అధికారులతో తక్షణమే మాట్లాడి, ప్రజల సమస్యల్లో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు.

అనంతరం శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ, ప్రజాదర్బార్ ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను పరిష్కరించడమేనని తెలిపారు. "కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించాం. మరికొన్నింటిని వచ్చే పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాం. ఒకవేళ పరిష్కారం కాని సమస్యలు ఉంటే, అది ఎందుకు కాలేదో కూడా అర్జీదారులకు తెలియజేస్తాం" అని ఆయన వివరించారు.

వైసీపీ విమర్శలపై ఎమ్మెల్యే కౌంటర్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులకు పనిపాట లేక తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.

మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ బాబు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిత్యం కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారిస్తున్నారు. ఇది ఓర్వలేకనే వైసీపీ నాయకులు 'కోటి సంతకాలు' అంటూ రోడ్డు మీద పడ్డారు. ఇక మీ ప్రభుత్వం ఎప్పటికీ రాదు, ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి" అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు.


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...