బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలికి అపూర్వ సన్మానం: తిరుపతిలో ఘనంగా అభినందన సభ:దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్:
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలిగా శ్రీమతి నిషిద రాజు నియమితులైన సందర్భంగా, ఆమెకు అభినందనలు తెలిపేందుకు తిరుపతిలోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో 12-11-2025 తేదీన ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వేలాది మంది మహిళా కార్యకర్తలు ఈ సభకు భారీగా తరలివచ్చారు.
ముఖ్య అతిథులుగా రాష్ట్ర, కేంద్ర నాయకులు
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు హాజరై శ్రీమతి నిషిద రాజు కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ , కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజా శ్రీనివాస వర్మ , శ్రీ సోమువీర్రాజు , శ్రీ పాకా సత్యనారాయణ పాల్గొన్నారు.
మహిళా మోర్చా నాయకులలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొల్లిన నిర్మల , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాలగ్రామం లక్ష్మీ ప్రసన్న , శ్రీమతి ముళ్ళపూడి రేణుక శ్రీమతి గీత కూడా సభకు హాజరై నూతన అధ్యక్షురాలికి అభినందనలు తెలిపారు.
మహిళా రిజర్వేషన్లు, సంస్థాగత ఎన్నికలపై ప్రసంగం
ఈ సందర్భంగా, మహిళా నాయకులు మాట్లాడుతూ... చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడాన్ని ప్రస్తావించారు. రిజర్వేషన్ల ప్రయోజనాన్ని అందుకునేందుకు మహిళలందరూ చైతన్యవంతులు కావాలని, అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికలలో తప్పక పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. మహిళా మోర్చా బలోపేతంలో శ్రీమతి నిషిద రాజు గారి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి మహిళా మోర్చా తరపున శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య శ్రీ రామ్, కార్యకర్తలు మరియు ఇతర మహిళా మోర్చా సభ్యులు నూతన అధ్యక్షురాలిని హృదయపూర్వకంగా అభినందించి, రాష్ట్రంలో పార్టీ విస్తరణకు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.


Comments
Post a Comment