Skip to main content

అగ్ర కుల రాజ్యం దాష్టీకం, సీఐ శంకరయ్య తొలగింపు


 

      చట్టం,న్యాయం అందరికీ సమానమే అన్నది ఒట్టి మాటలే అని,దున్నలు దున్నలు పోట్లాడితే దూడలకు కాళ్లు విరిగినట్లు,సీఐ శంకరయ్య ఉద్యోగం తొలగింపు ద్వారా మరొక్కసారి రుజువు అయ్యింది.

    బహుజనుల న్యాయ పోరాటం పై అగ్రకుల రాజ్యం చేసిన దాడిలో భాగమే బహుజన సిఐ శంకరయ్య ఉద్యోగం తొలగింపు. 

     అగ్రకుల రాజ్యం బహుజనుల కళ్లను బహుజనులతోనే పొడిపిస్తుంది.అందులో భాగమే బహుజన డి ఐ జి కోయ ప్రవీణ్ చేతితో మరో బహుజన కురవ సిఐ ని ఉద్యోగం నుండి తొలగింప చేసింది.

    ఇంతకీ సీఐ శంకరయ్య చేసిన నేరం ఏమిటి?అతను కత్తి పట్టుకుని యుద్ధం చేయలేదు,కేవలం తనకు జరిగిన అవమానానికి, అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను ఆశ్రయించడమే.అంటే అగ్రకుల రాజ్యంలో బహుజనులు న్యాయ పోరాటం కూడా చేయడానికి వీలులేదు,ప్రశ్నించకూడదు. 

    నేడున్న అగ్రకుల రాజ్యం సిఐ గారిని తొలగిస్తుంది,రేపు వచ్చే అగ్రకుల రాజ్యం డి ఐ జి కోయ ప్రవీణ్ గారిని తొలగించదన్న గారెంటీ లేదు,అందుకే బహుజనులు తమ ఉద్యోగాలకున్న విషేషాధికారాలను విజ్ఞతతో వినియోగించుకోవడం వల్లనే ఉమ్మడి బహుజన ప్రయోజనాలు నెరవేరుతాయని గ్రహించాలి. 

      అగ్రకుల రాజ్యం చేతిలో ఉన్న మీడియా,ముఖ్యమంత్రి గారి మీదనే ఒక బహుజన సీఐ పరువు నష్టం దావా వేస్తాడా? అని ప్రశ్నిస్తుంది. అంటే బహుజన సమాజం అగ్రకుల సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి, న్యాయస్థానాలకు వెళ్లడానికి వీలు లేదని నిర్ధారిస్తుంది.దీన్ని జర్నలిజం అంటారా?అగ్రకుల రాజ్య దురహంకారానికి కాపు కాయడం అంటారా? 

     చట్టం,న్యాయం అందరికీ సమానమైనప్పుడు బహుజన సమాజం న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడానికి వీలులేదని,భయపడించడం ప్రజాస్వామ్యమా?నియంతృత్వమా? 

     తప్పు చేయనప్పుడు ఎవరు ఎవరికైనా భయపడాల్సిన అవసరం ఏమిటి?అతనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసాడన్న కసితో ఉద్యోగం నుండి తొలగించడంతోనే అగ్ర కుల రాజ్యం తప్పు చేసిందని రుజువు అయ్యింది. 

   కావున శంకరయ్యను అప్రజాస్వామికంగా తొలగించిన వారిని న్యాయస్థానం కఠినంగా శిక్షించి,అవమానించిన వారికి భారీగా పరువు నష్టం చెల్లించేటట్లు చేసి, శంకరయ్యను యధాతధ స్థితిలో నిలపాలని బహుజన సమాజం గొంతెత్తి అరుస్తున్నది.

        బహుజన ఉద్యోగులు స్వేచ్ఛగా పని చేయడానికి వీలులేదని, వారు మా చేతిలో కీలుబొమ్మలని అగ్రకుల రాజ్యం హెచ్చరిస్తున్నది.మరి వారు చెప్పినట్లుగా అణిగి పని చేద్దామా?తిరుగుబాటు చేద్దామా?

కేవీ రమణ,జిల్లా అధ్యక్షులు, బెస్త సేవా సంఘం, అనంతపురం జిల్లా.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...