Skip to main content

విద్యార్థులు మన దేశానికి ఆశా దీపాలు... కరెంట్ గోపాల్

 

ఉరవకొండ


పట్టణం లో ఎమ్ పీ పీ యస్ సెంట్రల్ స్కూల్ లో బాల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఉన్న మన సెంట్రల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు అయిన S. శ్రీనివాసులు , D. శ్రీనివాసులు , K. హరికృష్ణ , P. చంద్రశేఖర్ నెహ్రూ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు 

 మన దేశానికి ఆశాదీపాలైన న ప్రియమైన విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలుతెలిపారు.

వక్తలు వేడుక ప్రముఖ్యత వివరించారు. మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతగానో ఇష్టం. ఆయన పిల్లలను "రేపటి దేశ నిర్మాతలు" అని అనేవారు. అందుకే ఆయన్ను మనం ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుస్తాం.

ఆయన జ్ఞాపకార్థం, పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని, ఈ రోజును మన బాల్యం యొక్క విలువను గుర్తుచేసుకోవడానికి కేటాయించారని వక్తలు తెలిపారు.

మరో వక్త కరెంట్ గోపాల్ మాట్లాడుతూ బాలలారా, మీరే మన నిజమైన శక్తిగా అభివర్ణించారు.

నేను గ్రామ పంచాయతీలోఉక్కీసుల గోపాల్ సీనియర్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తాను. ప్రతి ఇంటికి, ప్రతి పాఠశాలకు వెలుగు ఇవ్వడం మా పని. వెలుగు ఉంటేనే అభివృద్ధి సాధ్యం.

అలాగే, మీరు కూడా మన సమాజానికి, మన గ్రామానికి నిజమైన వెలుగులు. మీలో ప్రతి ఒక్కరిలో అపారమైన శక్తి, గొప్ప తెలివితేటలు, అద్భుతమైన కలలు ఉన్నాయి.

  కలలు కనండి: పెద్ద పెద్ద కలలు కనండి. ఆ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడి చదవండి. మీ ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి.

  ఆరోగ్యంగా ఉండండి: ఆటలు ఆడండి, పౌష్టికాహారం తీసుకోండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ మెదడు చురుకుగా పనిచేస్తుంది.

  మంచి పనులు చేయండి: పెద్దలను గౌరవించండి, తోటి స్నేహితులకు సహాయం చేయండి. మీలో ఉన్న మంచి గుణమే మిమ్మల్ని రేపటి గొప్ప పౌరులుగా మారుస్తుంది.

చాచా నెహ్రూ చెప్పినట్టుగా, నేటి బాలలే రేపటి ప్రపంచాన్ని నడిపిస్తారు. ఈ రోజు మీరు బాగా చదివితే, రేపు మీరే మన దేశాన్ని ముందుకు నడిపే డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు లేదా గొప్ప నాయకులు అవుతారని ఆశా భావం వ్యక్తం చేశారు.

మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ, మళ్లీ ఒకసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన టీచర్లకు జై హింద్ అంటూ ధన్యవాదాలు తెలియజేశారు.

ఎంపీపీస్ సెంట్రల్ స్కూల్, దాని ఉపాధ్యాయులు (S. శ్రీనివాసులు, D. శ్రీనివాసులు, K. హరికృష్ణ, P. చంద్రశేఖర్ లెనిన్ బాబు, వార్డు సభ్యులు నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...