Skip to main content

గూగుల్ కంపెనీలకు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి.. ప్రభుత్వం మెడికల్ కళాశాల నడపడానికి డబ్బులు లేవా...

 



పీడీ ఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ 

అనంతపురం నగరంలో ఎల్బీనగర్ లో పీ డీ ఎస్ యూ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కె . భాస్కర్, జిల్లా కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలలో నడపడానికి బడ్జెట్ లేదని చెప్పడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలను ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పిపిపి) విధానంలో నిర్వహిస్తామని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం సరికాదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలన్నింటిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 18 నెలలుగా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వైద్య విద్యను వ్యాపారమయం చేసి కార్పొరేట్ కబంధహస్తాల చేతులలో పెడుతున్నారు. మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేమని జాతీయ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాయడం వల్ల 2024 -25 విద్యా సంవత్సరంలో 1800 మెడికల్ సీట్లు రాష్ట్రంలో పేద విద్యార్థులు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మెడికల్ కళాశాల భూముల్ని 66 సంవత్సరాలకు కార్పొరేట్ వ్యక్తులకు లీజుకిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీలకు రాయితెలిచ్చి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నడపడానికి డబ్బులు లేవని చెప్పడం సరైనది కాదని దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు స్పెషల్ హెలికాప్టర్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పర్యటనలు చేస్తున్నారు కానీ, ప్రభుత్వం మెడికల్ కళాశాల ఏర్పాటు చేయమని చెప్పడం సరైనది కాదని అన్నారు. కావున కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాలు సరైనవి కాదని తక్షణమే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వాo నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్, జిల్లా నాయకులు ఉదయ్, మహేంద్ర, ఆనంద్, మురళి, వినోద్ మొదలైన వారు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...