ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి: అనంతపురంలో 'వీరనారి' సెమినార్
అనంతపురం, నవంబర్ 15:
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వసంతోత్సవాల సందర్భంగా, ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు (నవంబర్ 15, 2025) నగరంలోని ఎస్.ఆర్. (గర్ల్స్) జూనియర్ కళాశాలలో "వీరనారి" శీర్షికతో ప్రత్యేక సెమినార్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ముఖ్య అతిథుల ప్రసంగాలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మజ మేడం (సుప్రీంకోర్టు అడ్వకేట్, అనంతపురం) మరియు డా. బృందా మేడం (ఆర్ట్స్ కాలేజ్ మహిళా సాధికారత విభాగ్ సమన్వయకర్త, అనంతపురం) హాజరయ్యారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ...
"ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యం, సాహసం, మరియు స్వాతంత్ర్యం కోసం ఆమె చేసిన పోరాటం భారతదేశానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. ఆ వీరవనిత ధైర్య సాహసాలను ప్రతి విద్యార్థిని ఆదర్శంగాతీసుకోవాలి"
అంటూ విద్యార్థినులకు చాలా చక్కగా వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ సెమినార్లో ఆంధ్ర విద్యార్థి సంఘం (AVS) నాయకులు చురుకుగా పాల్గొన్నారు. వారిలో AVS స్టేట్ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర, AVS అనంతపురం జిల్లా అధ్యక్షులు వాల్మీకి వంశీ, AVS అనంతపురం జిల్లా కార్యదర్శి వాసిం ఖాన్, మరియు AVS నాయకులు కుమార్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ కార్యక్రమం జరిగింది.

Comments
Post a Comment