Skip to main content

ఉరవకొండ ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోండి: ఏవీఎస్ హెచ్చరిక

నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీ, కండిషన్ లేని బస్సులపై ఆంధ్ర విద్యార్థి సంఘం ఆగ్రహం
ఉరవకొండ మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయని ఆంధ్ర విద్యార్థి సంఘం (ఏవీఎస్) తీవ్రంగా మండిపడింది. అక్రమ ఫీజుల వసూళ్లు, ప్రమాదకరమైన బస్సుల నిర్వహణ, అర్హత లేని ఉపాధ్యాయుల బోధన వంటి అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సోమవారం నాడు జరిగిన పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) లో ఏవీఎస్ నేతలు ఈ మేరకు సమగ్ర ఫిర్యాదు సమర్పించారు.

 జీవోలను లెక్కచేయని ప్రైవేట్ యాజమాన్యాలు

ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 1,, 52,, 53 లకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ నిబంధనలను పాటించకుండా మిస్టర్ రాజ్యాంగ ఫీజులు (అధిక మొత్తంలో ఫీజులు) వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని ఏవీఎస్ నాయకులు ఆరోపించారు.

 విద్యార్థుల భద్రతకు ముప్పు: బస్సులు, డ్రైవర్ల లోపం

విద్యార్థుల జీవితాలతో ప్రైవేట్ పాఠశాలలు చలగాటమాడుతున్నాయి అని ఏవీఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

  బస్సులు: గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులను తరలించే బస్సులు సరైన కండిషన్‌లో లేవు. అవి నిత్యం ప్రమాదాలకు గురయ్యే స్థితిలో ఉన్నాయని తెలిపారు.

  సిబ్బంది కొరత: బస్సులకు అనుభవజ్ఞులైన డ్రైవర్లు లేకపోగా, డ్రైవర్ సహాయకుడు (అటెండర్) కూడా లేకపోవడం విద్యార్థుల భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని ఏవీఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

 క్రీడా మైదానాల లేమి: తగ్గుతున్న విద్యా ప్రమాణాలు

పలు పాఠశాలలకు క్రీడా మైదానాలు లేకపోవడం వలన విద్యార్థులు క్రీడా విద్యకు పూర్తిగా దూరమవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, అనేక ప్రైవేట్ పాఠశాలల్లో అధిక శాతం అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన జరుగుతుంది. వారికి నామమాత్రంగా జీతభత్యాలు చెల్లిస్తూ, పీఎఫ్ చట్టం ప్రకారం కూడా చెల్లింపులు జరపడం లేదని వారు తెలిపారు. దీనివల్ల ప్రైవేట్ విద్యా ప్రమాణాలు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు.

 విద్యాధికారి వైఫల్యం, యాజమాన్యాల దూకుడు

ప్రైవేట్ పాఠశాలల అక్రమాలను మండల విద్యాధికారి (ఎంఈఓ) కట్టడి చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఏవీఎస్ నేతలు విమర్శించారు. ఫీజుల వసూలుపై ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి అని ఫిర్యాదులో వెల్లడించారు.

 ఏవీఎస్ తీవ్ర హెచ్చరిక

బస్సుల కండిషన్లు, ఫీజుల నియంత్రణ, ఉపాధ్యాయుల అర్హతలు, వేతనాలు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని ఏవీఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్ర విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏవీఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వాల్మీకి వంశీ, జిల్లా కార్యదర్శి వాసిం ఖాన్, ఉరవకొండ నాయకులు సురేష్, కుమార్, శివరాజ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...