విడపనకల్ మండలం గాజుల మల్లాపురం,కరకముక్కల గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే,ఉరవకొండ వైసీపీ ఇన్చార్జ్,పిఎసి సభ్యులు వై.విశ్వేశ్వర్ రెడ్డి,యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృతంగా కొనసాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కరణం భీమరెడ్డి,భరత్ రెడ్డి,మండల కన్వీనర్ కురుబ రమేష్,లతవరం గోవిందు,సర్పంచ్ రామాంజనేయులు రెడ్డి,హంపయ్య,పాల్తూరు శివ,రామన్న,పురుషోత్తం ఆదిమూలం,కావలి వెంకటేష్, ఎర్రస్వామి రెడ్డి,వన్నారెడ్డి,ఆనంద్ రెడ్డి,బండే గౌడ్,బస్టాండ్ రాజు,గంగిరెడ్డి,మల్లికార్జున,ఓంకార్ రెడ్డి,నాగరాజు,రాజన్న,వన్నూరు స్వామి,శేఖర్,గురుదాస్,స్వామి తదితరులు పాల్గొన్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment