ఆధ్యాత్మిక అడుగంటుకు విద్యుత్ వెలుగు!
విడపనకల్లు గడేకల్లు చౌడమ్మ కొండపైకి 13 విద్యుత్ స్తంభాలు: పయ్యావుల సోదరుల మహాసేవ
విడపనకల్లు, గడేకల్లు: దైవసేవే ధ్యేయంగా పనిచేసే భక్తులు, దాతల కృషి ఎప్పుడూ నిరుపమానమే. విడపనకల్లు మండలం, గడేకల్లు గ్రామస్థుల పాలిట అలాంటి దైవదూతల్లా నిలిచారు స్థానిక భక్తి సేవా తత్పరులైన పయ్యావుల సోదరులు. వారి చొరవతో గ్రామానికి వాయువ్య దిశలో ఉన్న చారిత్రక చౌడమ్మ కొండపై కొలువై ఉన్న పురాతన ఆలయాలకు విద్యుత్ సౌకర్యం లభించింది.
భక్తుల కష్టాలు తీర్చిన దాతృత్వం
ఈ చౌడమ్మ కొండపై శ్రీ భీమలింగేశ్వర స్వామి ప్రథమ ఆలయం, సూర్య చంద్రుల ప్రతీక అయిన శ్రీ చౌడేశ్వరి దేవి పురాతన దేవాలయం వెలసి ఉన్నాయి. కొండపైకి నిత్యం తరలివచ్చే భక్తులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుంటూ పూజలు, దేవరలు నిర్వహిస్తూ ఉంటారు.
అయితే, కొండపైకి కనీస ప్రాథమిక వసతులు, ముఖ్యంగా విద్యుత్ సరఫరా లేకపోవడం ఆలయ అభివృద్ధి పనులకు, రాత్రి పూట భక్తుల సంచారానికి ప్రధాన అడ్డంకిగా ఉండేది. ఈ సమస్యను పయ్యావుల సోదరుల దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించారు.
13 పోల్స్ ఏర్పాటు... తీరిన చీకటి సమస్య
ఆధ్యాత్మిక సేవాభావంతో ముందుకొచ్చిన పయ్యావుల సోదరులు, ఆలయాల ప్రాముఖ్యతను గుర్తించి, కొండ అడుగు భాగం నుంచి పై భాగం వరకు మొత్తం 13 విద్యుత్ స్తంభాలను (పోల్స్) యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయించారు. జేసీబీలు, క్రేన్ల సహాయంతో కొండపై స్తంభాలను పాతి, వైరింగ్ పనులు పూర్తి చేయించారు.
ఈ కృషి ఫలితంగా కొండపైకి వెళ్లే భక్తులకు దశాబ్దాలుగా వేధిస్తున్న విద్యుత్ సమస్య శాశ్వతంగా తొలగిపోయింది. ఈ అద్భుతమైన సేవ చేసినందుకు గాను, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పయ్యావుల సోదరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సౌకర్యంతో ఆలయాల పునర్నిర్మాణం, ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరిగే అవకాశం ఉందని తెలుగు యువత నాయకులు ఏళ్ళ హరి పేర్కొన్నారు


Comments
Post a Comment