Skip to main content

పేదరికం,బహుజనులకు శాపమా!

 

పేదరికం,సహజమా? కృత్రిమమా?

నేడు 76వ రాజ్యాంగ దినం


పేదలు చదువుకో కూడదు, వారికి ఆస్తులు,అధికారం ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రభుత్వాలు,ప్రైవేట్,కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థలనే పెంచి పోషిస్తున్నప్పుడు పేదరికం కృత్రిమం కాక మరేమవుతుంది.

   నేడున్న వ్యవస్థ ధనవంతుల చేత ధనవంతుల కొరకు ధనవంతులే ఉండాలంటుంది.

    కేంద్రం,రాష్ట్రాలలో అధికారంలో ఉన్న

అధికార,ప్రతిపక్ష పార్టీలు అగ్ర వర్ణ,అగ్ర కుల,ధనిక ఆధిపత్య పార్టీలు కాబట్టే నిరంతరం అవి ధనవంతుల కోసమే పని చేస్తున్నాయి.

     స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ప్రసాధించిన ప్రజాస్వామ్యం,స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం,లౌకికత త్వాలను మూలన పడేయడం వలన విద్య,ఉద్యోగ రిజర్వేషన్లు అమలు కాలేదని గత 78 సంవత్సరాల చరిత్ర చెబుతోంది.

    మనదేశంలో వేల సంవత్సరాల నుండి ఆధిపత్య దోపిడీనే అమలులో ఉంది.దాని పునాదులు

వర్ణ వ్యవస్థ,మనుస్మృతి,కుల వ్యవస్థ,కాబట్టే పాలక కులాల జెండాలు ఎన్ని ఉన్నా

వారి అజెండాలు దోపిడీనే.

     ఈ ఆధిపత్య సమాజంలో బహుజనులు

మనిషులుగా గుర్తింపబడరు. అధికారంలో,దేశ సంపదలో వాటా ఉండదు.జనాభా లెక్కలలోఉండరు.విద్యను, వైద్యాన్ని అందించరు.

వీరు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వరు.

వీరికి బాధ్యతలు తప్ప హక్కులు ఉండవు.

వీరు కూడు,గూడు,గుడ్డ లేకుండా శాశ్వత బానిసలుగా ఉంటారు.వీరికి నిరంతరం మూఢత్వాన్ని నూరిపోస్తూ

మానవ రూపంలో ఉన్న పశువులుగా చూస్తారు. అందుకే దేశంలో బహుజనులు వేల సంవత్సరాలైన బానిసలుగానేఉండిపోయారు.

బహుజనులను విముక్తి చేయడానికి,బుద్ధుడు,కబీర్, సాహు,పెరియార్, ఫూలే, అంబేడ్కర్,కాన్షీరాం మహానీయుల మార్గంలో పోరాటం చేయాలి.

 మతవాద,కులవాద,తీవ్రవాద ఉగ్రవాద,ప్రాంతీయ వాద సృష్టి కర్తలు అగ్రవర్ణదురహంకారులే. దేశంలో అన్ని ఇజాలను సృష్టించి ప్రచారం చేస్తునదీ వీరే,అంటే భారత దేశ అన్ని సమస్యలకు మూలకారణం వీరేనని చరిత్ర చెబుతోంది.

    కులవాదులను,మత వాదులను,మావోయిస్టులను కమ్యూనిస్టులను,పెట్టుబడిదారులను,ప్రాంతీయ వాదులను తయారు చేసేది వీరే.

   విద్యను ప్రైవేటీకరణ చేసి పేదలను విద్య లేని వింత పశువులను చేసి,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి బహుజన సమాజానికి ఉద్యోగాలు లేకుండా చేసేది వీరే.

     పని చేసే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేసి, వారికి కూడు, గూడు, గుడ్డ, గౌరవం లేకుండా చేసేది వీరే.దేశంలో వీరి శాతం కేవలం 3 శాతం మాత్రమే.97 శాతంగా ఉన్న బహుజనులను మానసిక బానిసలుగా చేసేశారు.

     ఈ సమస్యలకు పరిష్కారాన్ని చూపే ఫూలే, అంబేడ్కర్ వాదులను ఈ సమాజం తయారు చేయక పోగా వీరి వాదముల పై దాడి చేస్తున్నారు.

   భూమి పుత్రులైన బహుజనులు పూలే, అంబేద్కర్ వాదములతో ఈ దేశానికి పాలకులు,దేశ సంపదకు యజమానులు అవుతారని కుట్రపూరిత మైన కుట్రలే పైన చెప్పబడిన అనేక వాదాల అవతారాలు.

కాబట్టి బహుజనులు పైన చెప్పిన బహుజన మేధావుల మార్గంలో పోరాటం చేయాలి.అప్పుడే బహుజనులకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది.పేదరికం నశించి సమానత్వం,ఏర్పడి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని రమణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదికరాష్ట్ర ఉపాధ్యష్యులు కేవిరమణ పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...