Skip to main content

ప్రతి విద్యార్థి బ్లడ్ శాంపిల్స్... ప్రతి హాస్టల్లో వాటర్ శాంపిల్స్ తీసుకోండి


అన్ని హాస్టళ్లల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు



విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్ ఇప్పించాలి

సంక్షేమ శాఖలకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం

సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు*

అమరావతి, నవంబర్ 25: ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు... రెసిడెన్షియల్ స్కూళ్లల్లోని నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం నూటికి నూరు శాతం నిర్వహించాలి. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదు. అలాంటివి పునరావృతమైతే... ఏం జరిగిందని తెలుసుకునేది ఉండదు... నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 20 శాతం హాస్టళ్లల్లో టాయిలెట్ల నిర్మాణం ఇంకా జరపాల్సి ఉంది. ఈ టాయిలెట్ల నిర్మాణం కోసం అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేస్తాం. టాయిలెట్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్లు లేకుండా హాస్టళ్లు ఉండడం సరి కాదు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరిగాయి. ఆర్వో ప్లాంట్లు లేని ప్రతి హాస్టల్లోనూ... ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లోనూ ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. డాక్టర్లతో విద్యార్థులకు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించాలి. హాస్టళ్లలోని 4.17 లక్షల మంది విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి సమస్యలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి చికిత్సలు అందించాలి. బడుగు విద్యార్థులకు చేసే సాయాన్ని బాధ్యతగా తీసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో హాస్టళ్లు పెట్టారు. దీనికి విఘాతం కల్గించేలా అలక్ష్యం చేస్తే ఊరుకునేదే లేదు. హాస్టళ్లల్లో పరిస్థితి పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనల చేపట్టడంతో పాటు...పరిస్థితులపై నిత్యం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించుకోవాలి.


*ప్రతి వారం ఆర్వో ప్లాంట్ల ఆడిటింగ్*


“సంక్షేమ రంగానికి చెందిన శాఖలన్నీ కలిపి ఉమ్మడిగా ఓ కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని హాస్టళ్లల్లోని విద్యార్థులకు డిజిటల్ హెల్త్ రికార్స్డ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. వైద్య పరీక్షలు నిర్వహించే సందర్భంగా విద్యార్థుల్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే... ఆ అనారోగ్య సమస్యలకు గల మూలాలను విశ్లేషించాలి. దానికి అనుగుణంగా వైద్యం అందేలా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోని హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా ప్రత్యేక కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ ఇప్పించండి. బాలుర హాస్టళ్లల్లోని వారికి మగ కౌన్సిలర్ల ద్వారా... బాలికల హాస్టళ్ల్లోని వారికి మహిళా కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే ఆత్మస్థైర్యంతో నిలబడగలిగేలా విద్యార్థులను తీర్చి దిద్దాలి. హస్టళ్లల్లో నీటి సరఫరా విషయంలో పంచాయతీరాజ్, హెల్త్, మున్సిపల్ శాఖలు, సంక్షేమ, వైద్యారోగ్య శాఖలు కలిసి పని చేయాలి. అన్ని హాస్టళ్లల్లో వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవాలి. ఎనిమియా, సికెల్ సెల్ వ్యాధులపై అవగాహన కల్పించే బాధ్యతను అధికారులపైనే ఉంది.”అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...