బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూర్ గ్రామంలో వెలిసిన హజరత్ సయ్యద్ కాజాసయ్యద్ షో సోఫీ శర్మాస్ హుసేని స్వాములవారి 347 ఉరుసు వేడుకలు ఈనెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఏడో తేదీన శుక్రవారం గంధం, ఎనిమిదో తేదీ దీపారాధన,9వ తేదీ రెండవ దీపారాధన, పదవ తేదీ దేవుని సవారి, 11వ తేదీన జియరత్ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దర్గాను వివిధ రంగులతో సుందరంగా అలంకరిస్తున్నారు. జిల్లా నల్ల మూలల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తుల కోసం త్రాగునీరు ,విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు . ఉరుసు లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment