ఉరవకొండ
జనవరి 17:మండల కేంద్రంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో రథసప్తమి వేడుకలకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా విడుదల చేశారు.
వచ్చే రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సమాచారం అందించేందుకు, ఉత్సవ వివరాలతో కూడిన ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, రథసప్తమి రోజున స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజలు, రథోత్సవం మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిరంజీవి మహేంద్ర గౌడ్, కృష్ణ మోహన్, సుధాకర్, నాగభూషణం స్వామి, వీరేష్ స్వామి, మాజీ ఎంపీటీసీ రామస్వామి, భీమన్న, శివశంకర్, నాగరాజ్, చక్రి, సీనా మరియు ఇతర ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
