సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చు.. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి వచ్చారు.
ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారు.. సాంకేతికతను అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి.
ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వచ్చాయి.. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి.
ఐటీ రంగంలో భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉంది.. నాలెడ్జ్ ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యత ఇవ్వడంవల్లే హైదరాబాద్ కు మేలు జరిగింది.
తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిన పరిస్థితి.. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారు.
ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఏపీవారే.. ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్ కు చెందినవారు.
భారతీయ ఐటీ నిపుణులు ప్రతి నలుగురిలో ఒకరు ఏపీకి చెందినవారే కావడం విశేషం.. సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పతో రూపురేఖలు మారాయి : సీఎం చంద్రబాబు
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment