ఎస్సీ,ఎస్టీ బీసీ మైనారిటీ వైద్య విద్య చదువుకోవడానికి అడ్డుగా ఉన్న 107, 108. జీవోలను రద్దు చేయాలని మంగళవారం కణేకల్ మండలం డా " బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నందు పీడీ ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంలో ఉన్న17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి అనుమతితో నిధులు సమకూర్చింది,ఈ కళాశాలను ఏర్పాటు చేసేటప్పుడు ఎస్సీ,ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల కు దూరం చేసే విధంగా 107, 108 జీవోను తీసుకొచ్చాయని, మా ప్రభుత్వం వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తుందని లోకేష్ బాబు తన యువగలం పాదయాత్రలో వైద్య విద్యార్థులందరికీ సమాన విద్యను అందిస్తామని ఉచిత విద్యను అందిస్తామని ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలలకు సంబంధించి 1800 మెడికల్ సీట్లు రద్దు చేయమని కూటమి ప్రభుత్వం జాతీయ మెడికల్ కౌన్సిల్ లకు లేఖ రాయడం చాలా దుర్మార్గం 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నాయి ఆ కళాశాలలను 66 సంవత్సరాలు లీజుకు ఇచ్చే విధంగా P4 విధానాన్ని తీసుకువచ్చి వైద్య విద్యను కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పూర్తిగా దూరం చేయడమే అవుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి 107, 108 జీవోలను రద్దు చేయాలి కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాన్ని రద్దు చేసి 17 వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ కణేకల్ మండలం కార్యదర్శి బాబా పకృద్దీన్ నాయకులు శ్రీకాంత్,సురేష్,సతీష్, ఆర్ సురేష్, అనిల్,గంగిరెడ్డి,వీరేష్, చరణ్,నరేష్, చిన్న,రంజిత్, తదితరులు పాల్గొన్నారు,
