కర్నూలు:ఈ ప్రెస్మీట్ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇందులో మనం ఆంధ్ర హైకోర్టు గురించి కాకుండా, రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం అవసరం. వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే, అమరావతి ఫ్రీ జోన్ అంశం గురించి కూడా మాట్లాడాలి. రాజధాని ప్రాంతమైన అమరావతిలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ, రాయలసీమ ప్రాంతంలోని చదువుకున్న యువతకు అమరావతి ఫ్రీ జోన్గా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిని '5 కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని' అని అనడం ఎంతవరకు సబబు, న్యాయం, ధర్మం?
రాష్ట్ర బడ్జెట్లో రాయలసీమ ప్రాంతానికి 35% నిధులు తప్పనిసరిగా కేటాయించాలి.
కర్నూలు హైకోర్టు బెంచ్: సుదీర్ఘ పోరాట చరిత్ర
16.11.1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం, రాయలసీమలోని కర్నూలులోనే ప్రధాన హైకోర్టును ఏర్పాటు చేయాలి. కానీ అది జరగలేదు. ఆంధ్ర హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోనీ, దానితో అయినా తృప్తి పడదాం అనుకున్నప్పటికీ, అది కూడా నెరవేర్చలేదు. ఏ పాలక పార్టీలు కూడా రాయలసీమకు న్యాయం చేయలేదు.
కర్నూలు హైకోర్టు బెంచ్ కోసం జరుగుతున్న పోరాటం ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1993లో కూడా కర్నూలు జిల్లా బార్ న్యాయవాదులు సుదీర్ఘ పోరాటం చేసి అలసిపోయారు. 2019లో కూడా న్యాయవాదులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. దాని ఫలితంగా, అప్పటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని అన్నారు, కానీ చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కర్నూలులో ఆంధ్ర హైకోర్టును (న్యాయ రాజధానిని) ఏర్పాటు చేస్తామని అన్నారు, కానీ చేయలేదు.
2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం (టీడీపీ, బీజేపీ, జనసేన) అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ, ఇంతవరకు ఆంధ్ర హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయలేదు. వారు తమ మాట నిలబెట్టుకోలేదు.
కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఉద్యమ చరిత్రకు 32 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో చాలా సులభంగా, శ్రమ పడకుండానే హైకోర్టు బెంచ్లను సాధించుకున్నారు. ఇప్పటికీ భారతదేశంలో 8 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు పనిచేస్తున్నాయి. చాలా రాష్ట్రాలలో రాజధాని ఒక చోట, ప్రధాన హైకోర్టులు మరో ప్రాంతంలో ఎలాంటి వివాదాలు లేకుండా విజయవంతంగా పనిచేస్తున్నాయి. మన కర్నూలు జిల్లా బార్ను ప్రేరణగా తీసుకుని భారతదేశంలోని ఇతర రాష్ట్రాల బార్ అసోసియేషన్ల న్యాయవాదులు హైకోర్టు బెంచ్లను సాధించుకున్నారు.
అయినప్పటికీ, మన కర్నూలు జిల్లా బార్లో కొందరు తుచ్ఛ రాజకీయాలు చేస్తూ, రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారు. ఆంధ్ర హైకోర్టు సాధన సమితి రాజకీయాలకు అతీతంగా, 16.11.1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులోనే ప్రధాన హైకోర్టును ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తుంటే, ప్రెస్మీట్లు పెట్టి కర్నూలు హైకోర్టు సాధన సమితి సభ్యులపై రాజకీయ రంగు పులిమి సమస్యను పక్కదారి పట్టించడం ఎంతవరకు డు సబబు?
ఈ సందర్భంగా, కర్నూలు జిల్లా బార్ అడ్వకేట్లకు, అన్ని పార్టీల అడ్వకేట్లకు సవినయంగా మనవి చేస్తున్నాం: ఆంధ్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని సాగుతున్న ఈ ఉద్యమంలో మీ వంతు సహకారం అందించాలని మా కర్నూలు హైకోర్టు సాధన సమితి సభ్యులు కోరుతున్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment