కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో పోస్టుకార్డులు పంపించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సూచించారని గుర్తు చేశారు. 2024లో ఎన్నికలకు ముందు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ హామీని నిలబెట్టుకోవాలని, తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సాధన సమితి పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు రాయలసీమ ప్రజలందరినీ ఈ ఉద్యమంలో భాగం చేసి నిరసనను కొనసాగిస్తామని హెచ్చరించారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment