శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణుల స్వాధీనం

0

 

హైదరాబాద్ : శషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి విదేశీ వన్యప్రాణుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా, అతని సామాను నుంచి అరుదైన వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు.అరుదైన జాతులు పట్టుబాటు
కస్టమ్స్ అధికారుల ప్రకారం స్వాధీనం చేసిన వన్యప్రాణాల్లో ఒక మానిటర్ బల్లి, రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాలు, మొత్తం 12 ఇగువానాలు ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న అరుదైన జాతులని తెలిపారు.తిరిగి బ్యాంకాక్ తరలింపు స్వాధీనం చేసిన ఈ వన్యప్రాణులను సంబంధిత అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తిరిగి బ్యాంకాక్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.ప్రయాణికుడు అదుపులో వన్యప్రాణాలను అక్రమంగా భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో సెక్యూరిటీ విభాగాలు అప్రమత్తమయ్యాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!