-నేడు గజ లక్ష్మీగాఅమ్మోరు
అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, సోమవారం ఉద్భవ లక్ష్మీ అమ్మవారు తొలిరోజు సోమవారం ఆదిలక్ష్మీ గా భక్తుల నీరాజనాలు అందుకొన్నారు.
ఉదయం దేవస్థానం లో అమ్మ వారికి సుప్రభాత, మేలుకొలుపు సేవలో భక్తులు తరించారు.అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.
ఉద్భవ లక్ష్మీ, ఆదిలక్ష్మిఅవతారం లోభక్తల, పూజలు, సేవల తో తరించారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాథ ఆచార్యులు, మయూరం బాలాజీ, ఆప్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
నేడు గజలక్ష్మీగా ఉద్భవలక్ష్మీ అమ్మవారు. సెప్టెంబర్ 23,తేదీ మంగళవారం: గజలక్ష్మిరూపం లో భక్తులకు దర్శన మిస్తారని ఈఓ తిరుమల రెడ్డి తెలిపారు.

Comments
Post a Comment