Skip to main content

చైర్మన్ కాని చైర్మన్ తోపెన్నాహోబిలం సిబ్బంది తంటా

 

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ నియామకం ఇప్పటివరకు జరగలేదు.

 అయితే ఇటీవల జిల్లాకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఓ పచ్చ పత్రిక లో పెన్నహోబిలం పాలకమండలి మరియు ట్రస్ట్ చైర్మన్ హోదా అంటూ ఓ టిడిపి నాయకుడు తమకు తాము ముందస్తు ప్రకటన వేయించటంతో పలువురు భక్తులు నివ్వెర పోయారు. అధికారికంగా ఇప్పటివరకు నియామకం జరగలేదు. ఈ పోస్టు తనకే దక్కుతుందన్న అతి విశ్వాసంతో ఆయన ఆ ప్రకటన గుప్పించారు. అప్పటినుంచి దేవస్థాన సిబ్బందిపై, అధికారులపై ఆ నాయకుడు పెత్తనం చెలాయించటంతో సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇల్లు కట్టకనే ఎలకల రావిడి అన్న చందంగా ఆయన తీరు మారినట్లు సిబ్బంది విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు సిబ్బంది నాయకుని చర్యల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.మరికొందరు

 పాలకమండలి చైర్మన్ నియామకం, ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే ఆ నాయకుని చర్యలతో సిబ్బందిలో లుకలుకలు మొదలయ్యాయి.. అతని చర్యలను ఖండిస్తే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని మరికొందరిలో భయాందోళనలు అల్బుకున్నాయి.

 పాలకమండలి ఆశావాహుల్లో ఇది మింగుడు పడటం లేదు. పాలకమండలి చైర్మన్ పదవి కోసం భాజపా పార్టీ ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ మహిళా నేత రేసులో ఉన్నారు. అనధికారిక చైర్మన్ గా ప్రకటించుకున్న వ్యక్తికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అండదండలు ఉండగా, మహిళా బిజెపి నేతకు అగ్ర నేత దగ్గుపాటి పురందేశ్వరి తో కలిగి ఉన్నాయి. మహిళా కోటా కింద దక్కే అవకాశం ఉంది. వీటికి తోడు శ్రీ శక్తి పథకం కింద మహిళలకు ఇప్పటికే చంద్రన్న ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నారు. బిజెపి నేతకు ఇది రెండవ ప్లస్ పాయింట్. వీటికి తోడు పదవుల పందేరంలో బిజెపి కూటమి భాగస్వామిగా ఉంది. ఆ కోట కింద అయినా పదవి లభించే ఛాన్సు అధికంగా ఉంది. ఎవరికి వారే చైర్మన్ హోదా తమకు దక్కుతుందంటే తమకు దక్కుతుందనే భావనలు వారి వారిలో నెలకొన్నాయి.

 

అయితే అనధికారిక హోదాలో చైర్మన్ కాకమునుపే చైర్మన్ అంటూ ప్రకటనలు గుప్పించటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అనధికార హోదాలో సిబ్బందిపై పెత్తనం జులుము ప్రదర్శించడం సరికాదనే భావనలు సిబ్బంది సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు.

  

  ఏది ఏమైనాప్పటికీ కూటమి భాగస్వామ్య పార్టీ బిజెపి మహిళా నేతకు దక్కుతుందా లేక టిడిపి నేతకు దక్కుతుందా అనే విషయంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా చర్చ కొనసాగుతుంది.

 ఏది ఏమైనప్పటికే పయ్యావుల సోదరుల మాటే శాసనం. వారి నిర్ణయమే కీలకం.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...