హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. బుధవారం ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం ప్రకారం, మియాపూర్ – ఎల్బీ నగర్ రూట్లో దూసుకెళ్తున్న మెట్రో రైలు భరత్నగర్ స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా ఆగిపోయింది.
రైలు ఆగిపోవడంతో డబ్బాలో ప్రయాణిస్తున్న వారు భయాందోళనలకు గురయ్యారు. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే కొద్ది సేపటికే సమస్యను అధిగమించి రైలును మళ్లీ ప్రారంభించడంతో ప్రయాణం సాఫీగా కొనసాగింది.
ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందిస్తూ, “సాంకేతిక లోపం కారణంగానే రైలు కొన్ని నిమిషాల పాటు ఆగిపోయింది. వెంటనే మా సిబ్బంది చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కరించబడింది. ప్రయాణికులకు పెద్దగా ఇబ్బందులు కలగలేదు” అని తెలిపారు.
గత కొన్ని నెలలుగా హైదరాబాద్ మెట్రోలో ఇలాంటి సాంకేతిక లోపాలు తరచూ ఎదురవుతున్నాయి. ఒక్కోసారి తలుపులు తెరుచుకోకపోవడం, ఎలక్ట్రిక్ సప్లై సమస్యలు, సాఫ్ట్వేర్ లోపాల కారణంగా రైళ్లు ఆగిపోవడం జరుగుతోంది. దీనితో ప్రయాణికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులు చెబుతున్న దాని ప్రకారం, మెట్రో సర్వీసులు నమ్మదగినవిగా ఉండటమే కాకుండా, నిరంతరాయంగా సాగాలి. తరచూ లోపాలు తలెత్తడం వల్ల ప్రయాణ సమయాలు దెబ్బతింటున్నాయని వారు అంటున్నారు.
హైదరాబాద్లో రోజూ లక్షలాది మంది మెట్రో సేవలను వినియోగిస్తుండగా, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment