Skip to main content

భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

 నంద్యాల:


ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి


గ్రామీణ 364, పట్టణ 214 ఆర్ఓ ప్లాంట్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలను ల్యాబ్ లకు పంపండి

 జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

*జిల్లా ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు అన్ని ఆర్ఓ వాటర్ ప్లాంట్లు క్రమం తప్పకుండా నాణ్యతా పరీక్షలు నిర్వహించి, BIS ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్ఓ ప్లాంట్ల భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు గాను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 364 ఆర్ఓ ప్లాంట్లు, పట్టణ ప్రాంతాలలో ఉన్న 214 ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలు సేకరించి ల్యాబ్ లకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్రాగునీటిని పరీక్షించే 13 పారామీటర్లైనా క్లోరైడ్, ఫ్లోరైడ్, టర్బిడిటీ, ఐరన్, నైట్రేట్, రంగు, వాసన, టోటల్ హార్డ్నెస్, ఆల్కలినిటీ, ఈకొలై బ్యాక్టీరియా, పిహెచ్, హెచ్2ఎస్ వైల్, కెమికల్ తదితర పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో నిర్దేశించిన ప్రమాణాలకు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్న సదరు ఆర్ఓ వాటర్ ప్లాంటులను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్లాంట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ర్యాపిడ్ ఫిల్టరేషన్ సిస్టమ్ లను సమయానికి మార్చడం, కంటైనర్లను శుభ్రపరచడం వంటి అంశాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ వివరించారు. BIS ప్రమాణాలకు విరుద్ధంగా నీరు సరఫరా చేయడం, ఆరోగ్యానికి హానికరమైన స్థాయిలో కలుషిత నీరు అందించడం, లైసెన్స్ లేకుండా ప్లాంట్ నడపడం తదితర నిబంధనలు సంబంధిత ఆర్ఓ ప్లాంట్‌ను సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ లేదని, త్రాగునీరు నాణ్యతలో నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...