Skip to main content

హిల్సా చేపల కోసం మత్స్యకారులకు సరికొత్త గైడ్: సముద్రంలో ఎక్కడ, ఎప్పుడు వేటకు వెళ్ళాలి?

పశ్చిమ బెంగాల్:మత్స్యకారులకు ఒక ప్రధాన సమస్య – సముద్రంలో ఎప్పుడూ ఎక్కువ చేపలు దొరుకుతాయో ముందే తెలుసుకోవడం. భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చింది. హిల్సా చేపల లభ్యత గుట్టును ఛేదించడం ద్వారా లక్షలమందికి వేట సులభం అయ్యింది. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోని హిల్సా చేపల లభ్యతను గుర్తించేందుకు ఇన్కాయిస్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కేంద్రం డైరెక్టర్ టి.ఎం. బాలకృష్ణన్ నాయర్ నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు మరింత సులభంగా హిల్సా చేపల లభ్యతను 70-72% కచ్చితత్వంతో గుర్తించే మోడల్ను అభివృద్ధి చేశారు. ఇందులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, లవణీయత, తరంగాల వేగం వంటి డేటాను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అనుసంధానం చేశారు. దీనిపై మూడేళ్లపాటు ప్రయోగాలు జరుగాయి. తాజాగా, ఫిషరీస్ ఓషనోగ్రఫీ జ‌ర్నల్‌లో హిల్సా చేపలను గుర్తించే పరిశోధన పత్రం ప్రచురించబడింది. ఇన్కాయిస్ ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లోనూ హిల్సా చేపల లభ్యతను గుర్తించింది. హిల్సా చేప 14–18 మీటర్ల లోతులో వేగంగా ఈదిస్తూ రోజుకు 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వీటి వేట ఎక్కువగా జరుగుతుంది. భారతదేశంలో లభించే హిల్సాల 90% పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలోనే ఉంటాయి. ధర కిలో రూ. 1,800–2,000 వరకు ఉంటుంది. ప్రత్యేకంగా దసరా మరియు పూజా సందర్భాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో హిల్సా చేపను నైవేద్యంగా సమర్పించడం కూడా జరుగుతుంది.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...