పశ్చిమ బెంగాల్:మత్స్యకారులకు ఒక ప్రధాన సమస్య – సముద్రంలో ఎప్పుడూ ఎక్కువ చేపలు దొరుకుతాయో ముందే తెలుసుకోవడం. భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చింది. హిల్సా చేపల లభ్యత గుట్టును ఛేదించడం ద్వారా లక్షలమందికి వేట సులభం అయ్యింది.
పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోని హిల్సా చేపల లభ్యతను గుర్తించేందుకు ఇన్కాయిస్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కేంద్రం డైరెక్టర్ టి.ఎం. బాలకృష్ణన్ నాయర్ నేతృత్వంలో హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు మరింత సులభంగా హిల్సా చేపల లభ్యతను 70-72% కచ్చితత్వంతో గుర్తించే మోడల్ను అభివృద్ధి చేశారు. ఇందులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, లవణీయత, తరంగాల వేగం వంటి డేటాను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అనుసంధానం చేశారు. దీనిపై మూడేళ్లపాటు ప్రయోగాలు జరుగాయి.
తాజాగా, ఫిషరీస్ ఓషనోగ్రఫీ జర్నల్లో హిల్సా చేపలను గుర్తించే పరిశోధన పత్రం ప్రచురించబడింది. ఇన్కాయిస్ ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లోనూ హిల్సా చేపల లభ్యతను గుర్తించింది. హిల్సా చేప 14–18 మీటర్ల లోతులో వేగంగా ఈదిస్తూ రోజుకు 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వీటి వేట ఎక్కువగా జరుగుతుంది.
భారతదేశంలో లభించే హిల్సాల 90% పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలోనే ఉంటాయి. ధర కిలో రూ. 1,800–2,000 వరకు ఉంటుంది. ప్రత్యేకంగా దసరా మరియు పూజా సందర్భాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ సమయంలో హిల్సా చేపను నైవేద్యంగా సమర్పించడం కూడా జరుగుతుంది.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment