నిత్యావసరాల సరుకులు కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రతీ కుటుంబానికి తప్పనిసరి అయినప్పటికీ, కొందరు వ్యాపారులు లాభార్జన ధ్యేయంతో వినియోగదారులను మోసం చేస్తున్నారు. తూకాలు, ధరల్లో తేడాలు, సరుకులపై చిరునామా, ఇతర వివరాల లేమి వంటి సమస్యలు వినియోగదారులను భ్రమలో పడుస్తున్నాయి.
వినియోగదారులు అధిక ధరలకు సరుకులు విక్రయించడం, తూకంలో తేడాలు, లేదా సరుకు వివరాలు లేకుండా అమ్మడం వంటి అనుమానాస్పద వ్యవహారాలను గమనించినట్లయితే, 1967 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. అధికార యంత్రాంగం వినియోగదారుల హక్కులను రక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటుంది.
ఇది వినియోగదారులకు ఒక హెచ్చరిక – సరుకుల కొనుగోలులో ఎల్లప్పుడూ జాగ్రత్త పాటించండి, మరియు మీ హక్కులను రక్షించడంలో నిష్క్రమించకండి.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment