హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా చేయడానికి డ్రోన్ల ద్వారా పోలీసింగ్ విధానం ప్రవేశపెట్టాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి సూచన ప్రకారం, అత్యంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి వాహనదారులకు ప్రత్యక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది.
అయితే, ఈ విధానం కోసం పోలీస్ విభాగం వెంటనే తగిన సంఖ్యలో డ్రోన్లను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ల ద్వారా వాహనాల రద్దీపై అంచనాలు వేయడం, రూట్ మార్గాలను సూచించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఉంది.
ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణలో నూతన యంత్రాంగం వేగంగా అమలు కానుందని అధికారులు తెలిపారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment