*ఎస్ ఆర్ ఐ టి కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జేఎన్టీయూ పరిపాలనా భవనం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది*
*ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ఉరితాడే శరణమా?*
ఎస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలి!*
విద్యార్థి సంఘాలు(AIFDS,PDSU, AISA,) ఆధ్వర్యంలో అనంతపురము జేఎన్టీయూ పరిపాలన విభాగం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి సిద్దు,పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జీ వీరేంద్ర ప్రసాద్, ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, మాట్లాడుతూ
యస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిగ్గు తేల్చాలనీ జెఎన్టియుసి గారికి రిజిస్టర్ గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ కళాశాలపై ఎలాంటి కమిటీ వేయకపోగా విద్యార్థిని మరణించి ఇన్ని రోజులు అవుతున్న ప్రభుత్వం ఇప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు ఒక పక్క విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కోటున్న ఇప్పటికీ ప్రభుత్వం కనీసం విద్యార్థి మరణపై కారణాలు చెప్పడం లేదని ప్రభుత్వన్నీ తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలపడం జరిగింది.
యస్ ఆర్ ఐ టి కళాశాలలో చోటు చేసుకున్న విద్యార్థి మరణం ఒక్క వ్యక్తిగత దురదృష్టం కాదు. ఇది ప్రైవేట్ విద్యా వ్యవస్థలో నెలకొన్న దోపిడీ, నిర్లక్ష్యం, అణచివేతలకు నిదర్శనం. విద్యార్థులు విద్యను పొందడానికి కళాశాలల్లో అడుగుపెడితే, ఆ ప్రదేశం జ్ఞానం ఇచ్చే ఆలయం కావాలి గానీ, ప్రాణాలను బలి తీసుకునే ఉరితాడుగా మారకూడదు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేట్ కళాశాలల దోపిడీతో ఇవాళ అదే వాస్తవం అవుతోంది.
ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు, దోపిడీ విధానాలు, మానసిక ఒత్తిళ్లతో విద్యార్థుల జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, మానవీయ విలువల లోపం, విద్యార్థుల సమస్యల పట్ల అసంవేదన వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏదంటే – ఈ పరిస్థితికి అసలు బాధ్యుడు ఎవరు?
ఇలాంటి ఘటనలపై మౌనం వహించడం అంటే విద్యార్థి ప్రాణాలపై రాజీ పడటమే. విద్యార్థుల హక్కులను కాపాడటం, భద్రతను నిర్ధారించడం, మానసిక ఒత్తిడుల నుంచి విముక్తి కలిగే విధంగా విద్యా విధానాన్ని మార్చడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.
విద్యార్థి మరణంపై ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోతే, అది విద్యా హంతక పాలన అనే ముద్రను తప్పించుకోలేరు. విద్యార్థుల ప్రాణాలు తేలికైనవికావు. బాధ్యులపై కటీన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ దోపిడీని అరికట్టాలి.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నాయకులు మహేంద్ర , ఇతర నాయకులు లోకేశ్ , ప్రణయ్ ప్రతాప్ , మరియు శివ , తేజ తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment