Skip to main content

అనంత ప్రైవేట్ కళాశాల మరణాల పై సమగ్ర దర్యాప్తు జరిపించాలి


 *ఎస్ ఆర్ ఐ టి కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జేఎన్టీయూ పరిపాలనా భవనం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది*


*ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు ఉరితాడే శరణమా?*


ఎస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలి!*

విద్యార్థి సంఘాలు(AIFDS,PDSU, AISA,) ఆధ్వర్యంలో అనంతపురము జేఎన్టీయూ పరిపాలన విభాగం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి సిద్దు,పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జీ వీరేంద్ర ప్రసాద్, ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, మాట్లాడుతూ

 యస్ ఆర్ ఐ టి కళాశాల విద్యార్థి మరణంపై నిగ్గు తేల్చాలనీ జెఎన్టియుసి గారికి రిజిస్టర్ గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ కళాశాలపై ఎలాంటి కమిటీ వేయకపోగా విద్యార్థిని మరణించి ఇన్ని రోజులు అవుతున్న ప్రభుత్వం ఇప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు ఒక పక్క విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కోటున్న ఇప్పటికీ ప్రభుత్వం కనీసం విద్యార్థి మరణపై కారణాలు చెప్పడం లేదని ప్రభుత్వన్నీ తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలపడం జరిగింది.

యస్ ఆర్ ఐ టి కళాశాలలో చోటు చేసుకున్న విద్యార్థి మరణం ఒక్క వ్యక్తిగత దురదృష్టం కాదు. ఇది ప్రైవేట్ విద్యా వ్యవస్థలో నెలకొన్న దోపిడీ, నిర్లక్ష్యం, అణచివేతలకు నిదర్శనం. విద్యార్థులు విద్యను పొందడానికి కళాశాలల్లో అడుగుపెడితే, ఆ ప్రదేశం జ్ఞానం ఇచ్చే ఆలయం కావాలి గానీ, ప్రాణాలను బలి తీసుకునే ఉరితాడుగా మారకూడదు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేట్ కళాశాలల దోపిడీతో ఇవాళ అదే వాస్తవం అవుతోంది.

ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు, దోపిడీ విధానాలు, మానసిక ఒత్తిళ్లతో విద్యార్థుల జీవితాలను దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, మానవీయ విలువల లోపం, విద్యార్థుల సమస్యల పట్ల అసంవేదన వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రశ్న ఏదంటే – ఈ పరిస్థితికి అసలు బాధ్యుడు ఎవరు?

ఇలాంటి ఘటనలపై మౌనం వహించడం అంటే విద్యార్థి ప్రాణాలపై రాజీ పడటమే. విద్యార్థుల హక్కులను కాపాడటం, భద్రతను నిర్ధారించడం, మానసిక ఒత్తిడుల నుంచి విముక్తి కలిగే విధంగా విద్యా విధానాన్ని మార్చడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

విద్యార్థి మరణంపై ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోతే, అది విద్యా హంతక పాలన అనే ముద్రను తప్పించుకోలేరు. విద్యార్థుల ప్రాణాలు తేలికైనవికావు. బాధ్యులపై కటీన చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ దోపిడీని అరికట్టాలి. 

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా నాయకులు మహేంద్ర , ఇతర నాయకులు లోకేశ్ , ప్రణయ్ ప్రతాప్ , మరియు శివ , తేజ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...