Skip to main content

ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి

                                                                                                   
కర్నూల్  జిల్లా: ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.3 వేలు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉల్లి రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. ఎకరాకు 20000 ప్రకటించి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకటించినటువంటి హెక్టార్కు రూ 50 వేలు రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి కూడా సరిపోవన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. సోమవారం కర్నూల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సందర్శించారు. ఆయనతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ , సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, పి నిర్మల, ఎండి ఆనంద్ బాబు, ఎండి అంజిబాబు, కె.వి నారాయణ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ లు ఉన్నారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు ఉల్లి రైతులతో మాట్లాడారు .ఉల్లి పంటలు సాగు చేసేందుకు దాదాపుగా లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సాయం ఏ మూలకు సరిపోదని ఆయనకు వివరించారు. ఇప్పుడు మార్కెట్ కు తెచ్చిన ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ప్రకటించడం దుర్మార్గమన్నారు. అక్కడే ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి, టమోటా, పొగాకు సాగుచేసిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికల హామీలు రైతులకు అమలు చేయరా అన్నారు. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న ప్రకటణ ఎక్కడ ఆచరణకు నోచుకోలేదన్నారు. ఉల్లిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి, ఇప్పుదు హెక్టార్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ 3 వేలు లాగా మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రైతులు పండించినటువంటి ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిని అంద చేయాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియా పేరుతో నరేంద్ర మోడీ మోసగిస్తున్నారన్నారు. అమెరికా ఆస్ట్రేలియా నుండి పత్తి, డైరీ ఉత్పత్తులు మొక్కజొన్న ఇతర పంటలను ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారన్నారు. మనదేశంలో పండించిన పంట ఉత్పత్తులపై అమెరికాలో అధిక సుంకాలను విధిస్తున్న మోడీ ఏమి అనకపోవడం దుర్మార్గమన్నారు. రైతులను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం మార్కెట్లో ఏర్పాటుచేస్తూ ఏడు సంవత్సరాలుగా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన ఏసీ గోడౌన్లను పరిశీలించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గురు శేఖర్, నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు సాయి ఉదయ్ రంగప్ప డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా నాయకులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...