మహారాష్ట్రలోని నవీ ముంబైలో భార్యల త్యాగం మరొకసారి మానవత్వాన్ని మేల్కొలిపింది. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు లివర్ మార్పిడి తప్ప ఇతర మార్గం లేదని తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల్లో ఎవరి అవయవాలు సరిపోలలేదు. ఈ క్లిష్ట సమయంలో భార్యలు అద్భుత నిర్ణయం తీసుకున్నారు.
ఒకరి భర్తకు మరోకరి లివర్ భాగాన్ని దానం చేయడం ద్వారా ఇద్దరి ప్రాణాలను రక్షించారు. వైద్యులు ఈ అరుదైన క్రాస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసుపత్రి వర్గాలు ఈ ఘటనను "త్యాగానికి ప్రతీక"గా అభివర్ణించాయి.
సమాజంలో తల్లితనాన్ని గొప్పదనంగా గుర్తించినప్పటికీ, భార్య ప్రేమలోని త్యాగం కూడా అంతే విశిష్టమని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. స్థానికులు, స్నేహితులు మాత్రమే కాకుండా వైద్యులు కూడా భార్యల ధైర్యాన్ని కొనియాడారు. "భర్త ప్రాణాల కోసం ప్రాణభాగాన్ని ఇచ్చిన వీర మహిళలు సమాజానికి ఆదర్శం" అని పలువురు ప్రశంసించారు.
ఈ సంఘటన, కుటుంబ బంధాలలోని ఆత్మీయతను, సతీమణుల నిస్వార్థ ప్రేమను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment