Skip to main content

16 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది



 

 -ప్రజా ఉద్యమం’ పోస్టర్లు విడుదల

ఈనెల 28న రాయదుర్గంలో ర్యాలీ 

రాయదుర్గం అక్టోబర్‌ 24 :

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘‘వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం‘పై రూపొందించిన పోస్టర్‌ను రాయదుర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించిన *వైసీపీ రాష్ట్ర జాయింట్ సెకరేట్రి మెట్టు విశ్వనాధ్ రెడ్డి 

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోంది. 

మెట్టు విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ

ఈనెల 28వ తేదీన రాయదుర్గం నియోజకవర్గ లో ర్యాలీ చేపడుతున్నాం. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు అనుబంధ విభగాల, అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని కోరుతున్నాం. 

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. 

16 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొంది

కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి అభిరుద్ది శున్యం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలలు నిర్మాణం చేపట్టి 5 అందుబాటులోకి తెచ్చారు. మరో రెండు కళాశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో 10 కళాశాలలను మన అనేవాళ్లకు కట్టబెట్టేందుకు జీవో కూడా ఇచ్చారు. 


ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను నిలువు దోపిడీ చేయడం కోసమే పీపీపీ పేరుతో చంద్రబాబు కూటమి సర్కార్ భారీ స్కాంకు తెరలేపారు.  


ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్‌ కళాశాలలు ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమం చేస్తున్నాం. 

రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. ఇంకా ఉధృతం చేయడంలో భాగంగా అక్టోబర్‌ 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలియజేసారు...

*ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట ఇలాగే కొనసాగుతుంది. ఇంకా ఉదృతం చేస్తామని కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు*


ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ ఐదు మండలాల కన్వీనర్లు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలాల నుండి ఎన్నుకోబడిన అనుబంధ విభగాల అధ్యక్షులు, ఎంపీపీ,సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...