Skip to main content

వచ్చే నెల 5లోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే పూర్తి చేయాలి



ఇళ్లు నిర్మించుకోని వారికి పట్టాలు రద్దు అంశంపై చర్చ


స్వంత స్థలము కలిగివుండి ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకునే వారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. దీనిపై తహసీల్దార్లు వేగంగా స్పందించి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గృహ నిర్మాణ శాఖ పి.డిలు, ఈ.ఈలు డి.ఈలు, ఏ.ఈలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ వెరిఫికేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– బి.ఎల్.సి. హౌసింగ్ కార్యక్రమం, ఎన్టీఆర్ హౌసింగ్ 2016 నుండి 2019 వరకు పెండింగ్ లో ఉన్న ఇళ్లను మొబైల్ యాప్ లో సర్వే చేయటం, 2021 నుంచి 2024 వరకు మంజూరై పూర్తైనవి, ఇంకా పనులు జరుగుతున్నవి.. అసలు ఇళ్లే నిర్మించుకోని వారు ఎంత మంది ఉన్నారు వంటి అంశాల గురించి చర్చించారు. ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో సర్వే జరుగుతున్న విషయంపై ప్రధానంగా చర్చించారు. ఇందులో తహసీల్దార్ల నుంచి పొజిషన్ సర్టిఫికెట్ ఆలస్యమవుతోందని కొందరు అధికారులు చెప్పారు. ఈ సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. ఆన్ లైన్ లో సర్టిఫికెట్ త్వరగా వచ్చేలా చూస్తామన్నారు. సర్వే విషయంలో సచివాలయ సిబ్బంది వేగంగా పని చేసేలా ఎంపీడీఓలు, రెవెన్యూ, హౌసింగ్ విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. నవంబర్ 5వ తేదీ లోగా సర్వే పూర్తి కావాలన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి పట్టాలు తీసుకున్నా.. ఇప్పటి వరకు ఇళ్లు నిర్మించుకోని వారి వివరాల గురించి ఆరా తీశారు. ఈ పట్టాలు రద్దైతే కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉంటుందని..ఈ అంశంపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఇళ్ల నిర్మాణాలకు రూ.1.50లక్షలు మాత్రమే ఇస్తున్నారని.. ఇది ఏమాత్రం సరిపోవడం లేదన్న అభిప్రాయం లబ్ధిదారుల్లో ఉందన్నారు. ఈ మొత్తాన్ని పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకము క్రింద అర్హులైన లబ్దిదారులు ఆవాస్ ప్లస్ 2024 మొబైల్ యాప్ లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై తగిన ప్రచారం జరగాలన్నారు. ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే సునీత సూచించారు....

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...