సాలూరు: జాతీయ షెడ్యూల్డు తెగల చైర్ పర్సన్ అంతర్ సింగ్ ఆర్యను రాష్ట్రానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అరకు, తిరుపతి ఎంపిలు డాక్టర్ తనూజా రాణి, డాక్టర్ మద్దెల గురుమూర్తిల ఆధ్వర్యంలో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందటం, వంద మందికి పైగా విద్యార్థినిలు ఆసుపత్రిలో చేరటం తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందజేసారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, నిరుపేద గిరిజన కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించ లేదని, కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని పిర్యాదు చేశారు. చైర్ పర్సన్ ను కలిసిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణిలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎంపీ జి. మాధవి, జిసిసి మాజీ చైర్పర్సన్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ స్వాతీ రాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజులున్నారు. తాము చెప్పిన వివరాలు, విద్యార్థినిల మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి దుస్థితిని విన్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ చలించిపోయారని, వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారని, రాజన్న దొర తెలిపారు.
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment