Skip to main content

ఏపీయూడబ్ల్యూజేకు ఎదురుదెబ్బ... ?!


- ఉరవకొండలో తిరగబడ్డ జర్నలిస్టులు

- జిల్లా అధ్యక్షుడి ఏకపక్ష ధోరణే కారణం 

- మంత్రికి బంధువు కావడం తోనే పెరిగిన నియంతృత్వ పోకడలు 

- చివరికి ఆయన చానల్ విలేకరి కూడా ప్రత్యర్థి వర్గంలోకి జంప్

- చీకట్లో ఒక "ఈనాడు" విలేకరి అండదండలు 


ఉరవకొండ, అక్టోబర్ 15:

ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ( ఏపీయూడబ్ల్యూజే ) ఉరవకొండ శాఖలో ముసలం పుట్టింది. అది ఏకంగా తిరుగుబాటుగా మారి... సొంత యూనియన్ ఏర్పాటు చేసుకునేందుకు దారి తీసింది. ఈ పరిణామాలు ఇలా దారి తీయడానికి ఏపీయూడబ్ల్యూజే అనంతపురం జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ వ్యవహార ధోరణే ప్రధాన కారణం అంటున్నారు. పయ్యావుల ప్రవీణ్ ఏపీయూడబ్ల్యూజే అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసున్నప్పటి నుంచి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. పయ్యావుల ప్రవీణ్ నియంతృత్వ పోకడలకు ముఖ్య కారణం, ఆయన జిల్లాకు చెందిన శక్తివంతమైన మంత్రికి బంధువు కావడమే. ఆ ధైర్యంతోనే ఉరవకొండలో ఏపీయూడబ్ల్యూజే శాఖను ఏర్పాటు చేసేటప్పుడు తనకు వ్యక్తిగతంగా కావల్సిన ఆరేడుగురు విలేకరులను పిలిపించుకుని, సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించి, కమిటీని ప్రకటించిపోయారు. ఆ సమయంలోనే మెజార్టీ సంఖ్య జర్నలిస్టులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే పయ్యావుల ప్రవీణ్ వ్యవహార శైలి వల్ల ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ జర్నలిస్టుల అసంతృప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో స్థానిక నాయకత్వం పెడ పోకడలు పెరిగిపోతూ వచ్చాయి. 

" యథా రాజా... తథా ప్రజా..." అన్న చందంగా జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్ వ్యవహరించిన విధంగానే స్థానిక నాయకత్వం వ్యవహరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉరవకొండ నియోజకవర్గంలోనీ మెజార్టీ జర్నలిస్టుల్లో అసంతృప్తి ఒక్క పెట్టున బద్దలైంది. ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని దశల వారీగా చర్చించి ప్రత్యేక యునియాన్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం తామే ఉద్యమించనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పయ్యావుల ప్రవీణ్ ప్రాతినిధ్యం వహించే చానల్ యొక్క స్థానిక విలేకరి కూడా కొత్త యూనియన్ లోకి చేరిపోవడం. 


 * చక్రం తిప్పిన 

ఓ "ఈనాడు" విలేకరి...!* 


 ఉరవకొండ నియోజకవర్గంలో కొత్త జర్నలిస్టు యూనియన్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితుల వెనుక ఈ ప్రాంతానికి చెందిన ఒక ఈనాడు దినపత్రిక విలేకరి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నిజానికి "ఈనాడు" దినపత్రికల విలేకరులు జర్నలిస్టుల యూనియన్లకు దూరంగా ఉండాలి. ఎవరైనా విలేకరిగా చేరే సమయంలోనే ఈ విషయాన్ని ఆ సంస్థ విధిగా స్పష్టం చేస్తుంది. అయితే ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల, ఇక్కడి ఓ "ఈనాడు" దినపత్రిక విలేకరి ఒక వర్గం రాజకీయ నాయకులతో రాత్రిపగలు మమేకం అవుతూ, తన సామాజికవర్గంకు చెందిన వారిని విలేకరులుగా నియమింప చేసుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టు యూనియన్ కూడా తన కనుసన్నల్లో మెలగాలనే ఉద్దేశ్యంతో కొద్ది నెలలుగా ఒక ప్రణాళికను అమలు పరుస్తూ వచ్చాడు. చివరికి ఆ పాచికలు ఫలించాయి. అందుకు సాక్ష్యంగా, కొందరితో ఆయన ఫండింగ్ చేయించాడు. దీంతో ఏపీయూడబ్ల్యూజే కు పెద్ద దెబ్బ తగిలింది. జర్నలిస్టులకు స్వేచ్ఛా వాయువులు లభించాయి.


 జర్నలిస్టుల అసంతృప్తికి

అసలు కారణాలు ఇవేనా...

ఉరవకొండలో ఇప్పటికే ఉన్న జర్నలిస్ట్


యూనియన్ నేతలు విలేకరుల సమస్యలు, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఈ విషయమై ఇక్కడి జర్నలిస్టులు గళమెత్తుతూనే ఉన్నారు. ఇందుకు తోడు ఇటీవలి కాలంలో యూనియన్ ముసుగులో మద్యం దుకాణదారులతో కుమ్మక్కై అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు . ఆ మొత్తాన్ని తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల దినపత్రికలకు చెందిన కొందరు విలేకరులు మద్యం సిండికేట్ నుంచి ఎక్కువ మొత్తంలో సొమ్ము తీసుకోవడం, వారు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరి, నియంతృత్వ ధోరణుల వల్లనే బలమైన యూనియన్‌ ఏర్పాటుకు అడుగులు పడినట్లుగా కూడా పలు కారణాలు చెబుతున్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...