శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నారాయణరెడ్డి అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్బీ (ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్), పీఎస్యూ (ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్) విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో డీఆర్వో, కలెక్టర్కు వారు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పోతలయ్య,
పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర మాట్లాడుతూ... శ్రీ సత్యసాయి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన నారాయణరెడ్డి భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రధాన ఆరోపణలు:
నాసిరకం చిక్కిల సరఫరా: నారాయణరెడ్డి స్వయంగా చిక్కిలు తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేసి, దాని ద్వారా నాసిరకం చిక్కిలను తయారుచేస్తూ, పోషకాహారంలో నాసిరకం అందిస్తూ చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
నియామకాల్లో అక్రమాలు: వన్ స్టాఫ్ సెంటర్ నియామకాలలో నకిలీ ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్లను సృష్టించి, ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ. 3 లక్షలు వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు.
మహిళా ఉద్యోగులపై అసభ్య ప్రవర్తన: మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, పలువురు చీదరించుకునే విధంగా వ్యవహరిస్తున్నారని నేతలు తెలిపారు.
* వసూళ్లకు పాల్పడటం: ఐసీడీఎస్ శాఖలో పనిచేస్తున్న ఇతర అధికారులను గుప్పెట్లో పెట్టుకుని, చిన్న తప్పిదాలు జరిగినప్పుడు వారి నుంచి భారీగా వసూలు చేస్తూ కోట్ల రూపాయలు కూడబెట్టారని ఆరోపించారు.
విచారణ జరపకుంటే ఆందోళన:
ఈ అవినీతి అధికారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు కలెక్టర్ను కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ నాయకులు జగదీష్, అనిల్, పీఎస్యూ నాయకులు కేశవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment