Skip to main content

కనీస మద్దతు ధర లేక మొక్కజొన్న రైతుల దయనీయ స్థితి:

 .

-ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్సార్‌సీపీ ఆందోళన

  శ్రీ  సత్యసాయి జిల్లా:రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు (MSP) లభించక మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైయస్సార్‌సీపీ) నేతలు రైతులను పరామర్శించి నిరసన వ్యక్తం చేశారు.

 శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, రోద్దం మండలం, తాడంగిపల్లి గ్రామంలో శనివారం మొక్కజొన్న రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ రైతులను కలిసి మాట్లాడారు.

అప్పుల ఊబిలోకి రైతులు: ఉషశ్రీ చరణ్

ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

"కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా?" అని ఆమె ప్రశ్నించారు.

మొక్కజొన్నతో పాటు మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని వంటి ఏ పంటకు కూడా కనీస మద్దతు ధరలు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో జోక్యం చేసుకోవాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని, పైగా రైతులను డ్రామాలతో నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబుపై మోసం ఆరోపణలు

ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలు విషయంలో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ఉషశ్రీ చరణ్ ఆరోపించారు.

చంద్రబాబు గారూ... మొక్కజొన్న విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. క్వింటాలుకు రూ.2,800కు కొంటామని చెప్పి, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. కానీ, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క క్వింటాల్‌ కూడా కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు," అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు కేటాయించి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు ఖర్చు చేసి అనేక పంటల రైతులను ఆదుకున్నామని ఉషశ్రీ చరణ్ గుర్తు చేశారు. "మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.300 కోట్లు కేటాయించి, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం దారుణం కాదా?" అని నిలదీశారు.

తక్షణ జోక్యం డిమాండ్‌

ప్రస్తుతం ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు సైతం ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ప్రభుత్వం రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. జనాభాలో 60 శాతం మంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర సంక్షోభం ఏర్పడితే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు.

వెంటనే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో మార్క్‌ఫెడ్ (MARKFED) ద్వారా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...