కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20మందికిపైగా సజీవ దహనం కావడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
