అక్టోబర్20
హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తుర్కియేకు చెందిన బోయింగ్ 747 కార్గో విమానం దుబాయ్ నుంచి వస్తూ ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం సహయక చర్యలు కొనసాగుతున్నాయి.