అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలో ని చాబాల గ్రామంలో శనివారం రోజు రాత్రి 7.గంటల సమయంలో గ్రామం లోని శివాలయం లో పూజలు నిర్వాహించి అనంతరం భక్త కనకదాసు విగ్రహాన్ని గ్రామం లోని పురావీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో కురుబ నాయకులు LIC పుల్లయ్య, ఘానాచారి గోపాల్, ఆటో ఉమాపతి,చక్రి స్వామి, కామాటం భీలింగ, ఈశ్వరయ్య,గోవర్ధన్, నాగరడోన్ గొపాల్,లింగరాజు, ఎర్ర నాగరాజు,చంద్రమౌళి, వైస్సార్ సీపీ ఉపసర్పంచ్ కుల్ల యిస్వామి, గురుమూర్తి, కురుభ సోదరులు గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు
అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్హ్యాండెడ్గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్లో వీడియో మరి...

Comments
Post a Comment