తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు.సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. “జయ జయ హే తెలంగాణ” గీతం రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రజల్లో గర్వభావం నింపింది.ఆయన మరణం సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు._
3/related/default
