Skip to main content

అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు యాత్ర

ఎస్కేయూ, జేఎన్టీయూ, సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి.

ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు ఏర్పాటు చేయాలి. 

వజ్రకరూర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి. 

డిగ్రీలో తీసుకొచ్చిన హానర్స్ డిగ్రీ ,మేజర్ - మైనర్ సబ్జెక్ట్ విధానాన్ని రద్దు చేయాలి.

పెండింగ్ లో ఉన్న 6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి.

నవంబర్ 3 తేదీ నుండి 7 తేదీ వరకు అనంతపురం జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు యాత్ర ప్రారంభించడమైనది దీనికి సంబంధించినటువంటి కరపత్రాలు ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M.హరూన్ రషీద్ విడుదల చేశారు వారు మాట్లాడుతూ..... ఈ జీపు యాత్రకు విద్యార్థులు, యువత, మేధావులు కలిసి జయప్రదం చేయాలని అలాగే SK యూనివర్సిటీ,JNTU , సెంట్రల్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి అలాగే ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కావున వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి అలాగే ఉరవకొండ లో ఉన్నటువంటి బాలికల జూనియర్ కళాశాలకు విద్యార్థులకు అనుగుణంగా కళాశాల భవనాలు ఏర్పాటు చేయాలి, మరియు పెండింగ్లో ఉన్నటువంటి 6800 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ఈ ప్రభుత్వం విడుదల చేయాలి, మరియు ఇంటర్ విద్య తీవ్రంగా దిగజారింది అనడానికి నిదర్శనం మొన్న ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలోనే మన జిల్లా వెనుకబడి ఉంది సగానికి పైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేకపోయారు, శాశ్విత ప్రాతిపదికన అధ్యాపకులు లేక పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా మౌలిక సదుపాయాల ఏమిటో , ల్యాబులు, లైబ్రరీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొన్ని కళాశాలలో పర్మినెంట్ పోస్టులు కేవలం ప్రిన్సిపల్ లకే పరిమితం అయిందంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఎంత నిర్లక్ష్యం చేపడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాత పద్ధతిలోనే కళాశాల సమయం కొనసాగించాలి, ఇక కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులకు అడ్డు అదుపు లేదు, వివిధ కోర్సులు పెట్టి తల్లిదండ్రులను మోసం చేసి లక్షల్లో ఫీజు దోచుకుంటున్నారు, ప్రభుత్వం నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు, ప్రభుత్వం జిల్లాలో ప్రకటించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రకటనకే పరిమితమైనాయి. దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి లేనిచో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం అయినది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M.హరూన్ రషీద్, ఉరవకొండ మండల అధ్యక్షుడు రాజేష్ ఎస్ఎఫ్ఐ నాయకులు అభిషేక్ , పవన్, అరవింద్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...