Skip to main content

అనంతపురం జిల్లా ఎల్డిఎం కి ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి.


 


 జిల్లాలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న సిసిఆర్సి ఉన్న కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు విడపనకల్లు ఉరవకొండ మండలాల్లోని దేవాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు గత డిసెంబర్ నాటికి వ్యవసాయ అధికారులు పంపిన కౌలు రైతుల జాబితాలో బ్యాంకు అధికారులు టేబుల్ మీద ఉన్నాయి తప్ప పరిశీలించడం కానీ సర్వే చేయడం గాని లేదు ఈ సంవత్సరం కూడా ఒక కౌర రైతుకి పంట రుణం అందే పరిస్థితి లేదు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణం ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి కౌలురై ఎకరాకు 5000 నుండి 30 వేల వరకు ముందస్తు కౌలు చెల్లించి మిర్చి పంటకు ఎకరా పంటకు లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టి బయట అప్పులు చేసి వడ్డీలు కడుతూ ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు ప్రభుత్వము రాష్ట్ర, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కౌలు రైతులకు రుణాల ప్రతిపాదన తెస్తున్నారు తప్ప జిల్లా, స్థానిక బ్యాంక్,వ్యవసాయ అధికారులు కౌలు రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు కనీసం కౌలు రైతుల సమాచారం ఆధార్, బ్యాంక్ అడ్రస్ తో కూడినటువంటి సమాచారం స్థానిక వ్యవసాయాధికారులు ఇప్పటికీ జిల్లా అధికారులకు,బ్యాంకు అధికారులకు పంపిన దాఖలాలు లేవు పై అధికారులు కూడా పరిశీలన చేసే పరిస్థితి లేదు పరిస్థితి ఇలా ఉంటే కౌ రైతులకు ఏ విధంగా రుణాలు ఇచ్చే, అప్పుల ఆత్మహత్యలనుండి ఆదుకుంటారు పై విషయాల సమస్యలను వ్యవసాయ బ్యాంకు అధికారులకు జులై నుండి కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేస్తున్న కనీసం ఇప్పటికీ చలనం లేదు ఏపీజీబీ యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఉరవకొండ నియోజకవర్గం లో ఉన్న బ్యాంకు అధికారులు కౌలు రైతుల పట్ల రకరకాల ఇబ్బందులు అవమానంగా హేళన చేస్తూ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే లక్షల రూపాయలు అప్పుల బారిన పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు దేవాదాయ భూముల సాగు చేస్తున్న కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కౌలు రైతుకు రెండు లక్షల అరవై వేల రూపాయలు రుణం ఇస్తామని ప్రకటన చేశారు అయినా ప్రభుత్వ విధానాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందే పరిస్థితి లేదు అందువలన వెంటనే గ్రామ సభలు జరిపి ఎటువంటి షరతులు లేకుండా కౌలు రైతులందరికీ రెండు లక్షలు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు రంగారెడ్డి, బాల రంగయ్య, జిల్లా నాయకులు వెంకటేశులు రామాంజనేయులు, సురేషు, పొట్టిపాటి రామాంజనేయులు, మన్నీల రామాంజనేయులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...