Skip to main content

అన్నదాత ఆక్రందన! పట్టించుకోని ప్రభుత్వం!


 

--వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవి రమణ.

  ‌‌ అన్నదాతల ఆక్రందన పట్ల రాష్ట్ర ప్రభుత్వం చెవిటి,మూగ, గుడ్డి దానిలా ప్రవర్తిస్తూ, అన్నదాత సుఖీభవ కింద ఒక సంవత్సరం ఎగ్గొట్టి,ప్రస్తుతం 20,000 ఇస్తామనిచెప్పి, 17000కు కుదించి ఇస్తూ ఇదే రైతుల అన్ని సమస్యలకు పరిష్కారం అని అరచేయిని చూపించి మోచేతిని నాకిస్తున్నది.

 2025-26 ఖరీఫ్ లో

అతివృష్టి,అనావృష్టితో రైతులు ఆర్ధిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.

    పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కు తున్నారు, పొలం లోనే పంటను వదిలేస్తున్నారు.

అన్న దాతల కష్టాలను

తీర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏ మాత్రం చేయడం లేదు.

      ఖరీఫ్ లో

రాయలసీమ లో ప్రధాన పంట వేరుశనగ సాగు సంక్షోభం, ఉల్లి,సజ్జ,మొక్కజొన్న,పత్తి, అమ్మకాలు సంక్షోభం.

   రాయల సీమ హార్టికల్చర్ హబ్.పండ్లు,కూరగాయలు,పూల ఉత్పత్తిలో అగ్రస్తానం.

   రాష్ట్రం మొత్తం అన్ని రకాల పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు అయితే,ఇందులో అరటి ఒక్కటే 74లక్షల టన్నులు.ఇందులో ప్రధాన ఉత్పత్తి రాయల సీమ జిల్లాలలోనే.ప్రత్యేకంగా G 9 అరటి ఉత్పత్తిలో అత్యంత వెనుకబడిన,అనంతపురం,కడప,అన్నమయ్య,సత్యసాయి జిల్లాలదే అగ్ర స్థానం.ప్రస్తుతం అరటి ధరలు క్వింటాలు 200 నుండి 300 రూ"కు పడిపోయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.

    ఉల్లి రైతు ట్రక్కులతో ఉల్లిపాయలు పారబోయటం, పొలాల లోనే వదిలివేయటం, పంటను దున్నివేయటం చూసాం.నేడు అరటి రైతు గెలలను పారబోయటం,అరటి తోటను ట్రాక్టర్ తో దున్ని వేయడం చూస్తున్నాం.

 కష్టపడి సాగు చేసిన పొలాన్ని,ప్రేమతో పెంచుకున్న పంటను పారవేస్తూ రైతు మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు.ఈ సంక్షోభం నుండి కాపాడమని వేడుకుంటున్నారు.

మన కళ్ల ముందే ఇలా జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి.

    రాష్ట్ర వ్యాప్తంగా అరటి తొమ్మిది జిల్లాలలో సాగవుతుంది,సుమారు 50 లక్షల టన్నుల పంట దిగుబడి ఉండి,అనేక రాష్ట్రాలకు ప్రత్యేకంగా దేశ రాజ ధాని ఢిల్లీకి ఎంతో ఆరోగ్య కరమైన పండును అందిస్తూ పెట్టు బడి కూడా రాని ధరకు అమ్ముకుంటున్నారు.అరటి సాగుకు పెట్టుబడి కూడా ఎక్కువే.

   అనంతపురం నుండి శ్రీకాకుళం వరకూ ప్రతి రైతు సంక్షోభమే.ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం తప్ప.ఇంత వరకూ ఏ పంట పండించిన రైతునూ ఆదుకున్న దాఖలాలు లేవు.

      చివరికి గత వైసీపీ ప్రభుత్వంలో వలె ఉచిత ఇన్సూరెన్స్ లేదు,ఇన్పుట్ సబ్సిడీ కూడా లేకుండా చేసి రైతుల పట్ల అతి కఠోరంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వానికి పతనం ఎంతో దూరం లేదునివెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవి రమణ హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...