జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందు సిద్దు
ఏ ఐ ఢీ యఫ్రా యస్ష్ట్ర vv ప్రథమ మహాసభలు డిసెంబర్ 5,6 తేదీల్లో జరిగే అసెంబ్లీ టైగర్ ఓంకార్ నగర్- కర్నూల్ జరిగే కరుపత్రాలను ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విడుదల చేయడం జరిగింది*
వారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం మూడోసారి
వచ్చిన ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకు వచ్చింది. ఇది రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కాలరాస్తుందని, రిజర్వేషన్లకు పాతర వేస్తుందని అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, చెపుతున్న వారి మాట వినడం లేదు. దీని ద్వారా అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను, ఇతిహాసాలను విద్యార్థుల మెదళ్ల లోకి ఎక్కించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను సంక్షోభం లోకి నెట్టాడం, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో 472 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే 210 కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు. 26 జిల్లాలకు ఒక్క చోట కూడా రెగ్యులర్ డి. వి.ఇ.ఓ.లు లేరు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 మంది రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లు (ఆర్.ఐ.ఓ)లు ఉండాల్సిన చోట ఒక్క రెగ్యులర్ అధికారి కూడా లేరు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 3600 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు, 1200 మంది గెస్ట్ ఫ్యాకల్టీ రెగ్యూలర్ జూనియర్ లెక్చరర్లు 1400 మంది ఉన్నారు. 2500 పైగా రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.అలాగే కుటుంబంలోని ప్రతి విద్యార్థికి తల్లికి వందనం' పేరుతో ఇస్తామన్న రూ.15,000/- షరతులు లేకుండా అమలు చేయాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెం ట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అడ్డంకిగా ఉన్న జీవో 77 రద్దు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేలు పోస్టుల్ని భర్తీ చేయాలి. బడ్జెట్లో కేటాయిం పులు విద్యారంగంకు కేంద్రలో 10%, రాష్ట్రంలో 30 శాతం నిధులు కేటాయిం చాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నామమాత్రంగానే నిధులు కేటాయిస్తుంది. గురుకుల విద్యలయాలలో అవినీతి, అక్రమాలు జరుగుతునాయి. హాస్టల్ విద్యర్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెన్, కాస్మెటిక్ చార్జీలు పెం చకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. సొంత భవనాలు నిర్మిం చి, నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలి.
అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య పోరాటాలతో పాటు సేవా, అవగామన కార్యక్రమాలు ముందుడి కృషి చేస్తుంది. విద్యార్థులలో పెరుగుతున్న డ్రగ్స్, ర్యాగింగ్, లాంటి దురలవాటులకు వ్యతిరేకంగా విద్యార్థులతో చైతన్యం కల్గిస్తూ, సామాజిక భాధ్యతను గుర్తుచేస్తూ విస్తృతంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందరికి విద్యా - ఉపాధి అవకాశాలు కోసం పోరాడుతూనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము,విద్యార్థులలో అభ్యుదయ భావాలు,దేశభక్తిని పెం పోందిస్తున్నము.అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (AIFDS) రాష్ట్ర ప్రథమ మహాసభలు రాయలసీమ ఒక్కప్పటి రాజధాని కర్నూలు జిల్లా ఎంపిక చేసుకొని రాష్ట్ర మహాసభలు జయప్రదం ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్డిఎస్ జిల్లా నాయకులు తరుణ్, మండల అధ్యక్ష కార్యదర్శులు మధు, కొల్లాయి స్వామి, నాయకులు సాయి, వంశీ, అమ్రేష్, సుదీర్,రాజ్ కుమార్,తదితరులు పాలుగోన్నారు.


Comments
Post a Comment